నర్సంపేట, అక్టోబర్ 24: ముస్లిం మైనార్టీలకు బీఆర్ఎస్ సర్కారు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని జీఆర్ గార్డెన్స్లో క్రైస్తవ ఆశీర్వాద కృతజ్ఞత సభను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది గెలుపు కోసం క్రైస్తవులు ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ చర్చీల నిర్మాణం కోసం నర్సంపేటలో నిధులు అందించామన్నారు. క్రిస్టియన్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేశామన్నారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్పారు. అత్యధిక నిధులు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, రాయిడి రవీందర్రెడ్డి, నల్లా మనోహర్రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, ఫాదర్లు పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్: ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎంఏఆర్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ ముస్లిం మైనారీలు, ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పెద్ది హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో మసీదుల అభివృద్ధిలో భాగంగా 37 మసీదులకు ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేయించామని, ఎవరు పనులు చేస్తారో వారి ఖాతాల్లోనే ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందన్నారు. మరోసరి ఆశీర్వదిస్తే మిగితా పనులను పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మతకల్లోలాలకు తావులేదన్నారు. నర్సంపేటలో మైనార్టీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేసినట్లు చెప్పారు. మైనార్టీల కోసం పట్టణంలో షాదీఖానను మంజూరు చేస్తే కాంగ్రెస్ నేతలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని గుర్తుచేశారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో రూ. 18 కోట్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణ, ఎండీ చాంద్పాషా, రాయిడి రవీందర్రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, బత్తిని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, గఫార్, పాషా పాల్గొన్నారు.