జనగామ, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : ‘హైదరాబాద్కు సమీప ప్రాంతం కాబట్టి జనగామ వంద శాతం అభివృద్ధి చెంది తీరుతది..భవిష్యత్లో ఐటీ కారిడార్.. పరిశ్రమలతో చాలా అద్భుతంగ మారుతది.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలన్నది ఆ ప్రాంత ప్రజల కోరిక.. అదేం పెద్ద విషయం కాదు.. రాజేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకొని రండి.. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే చేర్యాల రెవెన్యూ డివిజన్ జీవో విడుదల చేస్తా.. జనగామకు నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు కూడా వస్తయ్ ’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జనగామ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించిన బీఆర్ఎస్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ఈ ప్రాంతానికి మరిన్ని వరాలు కురిపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి కోరిన అన్నింటికీ వెంటనే ఓకే చెప్పారు. ‘ఎమ్మెల్యే కాకముందే నియోజకవర్గ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి తపన పడే ఇట్లాంటి మంచి నాయకుడు ఉండాలె’ అంటూ పల్లాపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘పొన్నాల దీవెన.. ముత్తిరెడ్డి ఆశీర్వాదంతో లక్ష మెజార్టీతో పల్లా గెలుపు ఖాయమైంది’ అని స్పష్టం చేశారు.
జనగామను జిల్లాగా ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీ ఇచ్చి విప్లవాత్మక అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్, సోమవారం జిల్లా కేంద్రంలో కనీవినీ ఎరుగనిరీతిలో నిర్వహించిన జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో మరిన్ని వరాలు కురిపించా రు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి కోరి న అన్నింటికీ వెంటనే పచ్చజెండా ఊపారు. ‘పల్లా రాజేశ్వర్రెడ్డి హుషారుగ ఉంటడని తెలుసని, ఇంత హుషా రు అని తెల్వదు.. మీరు సభ పెట్టిపోతే చాలు..గెలిసొచ్చి న తర్వాత అన్నీ అడుగుత అన్నడు..ఈడికి వచ్చిన త ర్వాతనేమో ‘దొడ్లెకచ్చిన గోద పెండ పెట్టకపోతదా’ అ న్నట్లు పెద్ద..లిస్టు చదివి ఇవి చేస్తవ..సస్తవా అన్నట్లు చేసిండు..ఈయన కన్న ముత్తిరెడ్డే నయముండె’ అంటూ చమత్కరిస్తూనే..‘ఎమ్మెల్యే కాకముందే నియోజకవర్గ సమస్యలు తెలుసుకొని వాటి పరిషార్కానికి తపన పడే ఇట్లాంటి మంచి నాయకుడు ఉండాలె’ అంటూ పల్లాపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ‘చేర్యాలను రెవెన్యూ డివిజన్గా చేయాలన్నది ఆ ప్రాంత ప్రజల కోరిక..అదేం పెద్ద విషయం కాదు.. ప్రభుత్వం ఏర్పడిన నెలలోనే చే ర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తూ జీవో విడుదల చేస్తాన ని హామీ ఇచ్చారు. జనగామ మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు వస్తాయని చె ప్పారు. అది రాష్ట్రస్థాయి పాలసీలోనే ఉందన్నారు.
‘అయినా పెద్ద నీరడే (పల్లా) మీ దగ్గర ఉన్నడు.. జనగామ అభివృద్ధి బాధ్యత నాదే ఎన్నికల తర్వాత ప్రణాళికాబద్ధం గా ముందుకు పోదా’మని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నంత సేపూ సభలో జనం చప్పట్లు, కేరింతలతో హోరెత్తించారు. జనగామ సమస్య లు తెలుసుకొని వాటన్నింటి గురించి పల్లా చెప్పారని.. అవన్నీ చేయదగినవేనని, అన్నింటినీ చేసి పెడుతానని స్పష్టం చేశారు. ‘చేర్యాలలో ఎన్నికల ముగింపు బహిరంగ సభకు నియోజకవర్గానికి మళ్లీ వస్తా..మీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి పెం డింగ్ పనులు, సమస్యలన్నీ పరిష్కరిస్తా’నంటూ హామీ ఇచ్చారు. ‘ఒకనాడు బచ్చన్నపేట కరువు చూసి ఏడ్చిన.. ఇప్పుడు హెలికాప్టర్లో వస్తుంటే ఎటుచూసినా పచ్చదనం చూసి సంతోషమైంది’ అని గుర్తుచేశారు. ‘జనగామలో ఒకప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి ఉండె.. యాది చేసుకుంటేనే భయపడే పరిస్థితి.. కండ్లకు నీళ్లచ్చే పరిస్థితి ఉండె.. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఎనిమిది సంవత్సరాలు అన్ని జిల్లాలు..మండలాలు నలుచెరుగులా, మూలమూలలా తిరిగిన.. మీకు తెలుసు.. కం డ్లకు నీళ్లు తీసుకొని స్టేజీల మీదనే ఏడ్చిన..అట్లాంటి ప్రదేశాల్లో బచ్చన్నపేట మండలం ఒకటి’ అని కేసీఆర్ గుర్తు చేశారు. సిద్దిపేట నుంచి సూర్యాపేటకు పోతూ వయా బచ్చన్నపేట మీదుగా పోతుంటే మండల కేంద్రంలో కొ ద్దిసేపు ఆగి జీపు ఎక్కి మైక్లో మాట్లాడుతుంటే ఎదురుంగ చూస్తే ఒక్కరు కూడా యువకులు లేరని నాటి దృ శ్యాలను తలుచుకున్నారు.
‘నా ముందు అందరూ వయ స్సు అయిపోయిన వారే ఉన్నరు.. ఏమైందని అడిగితే ఎనిదేండ్లు కరువుతో బచ్చన్నపేట చెరువు అడుగంటిం ది.. బావుల్లో నీళ్లు లేవు.. బోర్లు ఎండిపోయినయ్ ఎనిమిది కిలోమీటర్లు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నం అని ఏడ్చిండ్లు.. నాకు కూడా దుఃఖం ఆగలేదు’ అని కేసీఆర్ పేర్కొన్నారు. వారానికోరోజు స్నానం చేయలేని పరిస్థితుల్లో ఆనాడు యువకులు అన్నమో రామచంద్రా అని పొట్టచేత పట్టుకొని వలస పోయిన దుస్థితిని తాను కండ్లారా చూసి వలవలా ఏడ్చానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈరోజు చూస్తే తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ‘కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేటప్పుడు చాలామం ది చాలా మాటలు చెప్పిన్రు. నేను ఒకటే చెప్పిన, హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే మార్గంలో ఒకటి లేదా రెండు ఎకనామిక్ గ్రోత్ సెంటర్లు కావాలని కోరితే..ఆర్థిక నిపుణులు వేరే పాయింట్లు సూచిస్తే..నేనే నా పెన్నుపెట్టి ఇది కాదా అని జనగామ, భువనగిరి మీద పాయింట్ పెట్టిన. ఈ రెండు కూడా ఇప్పుడు బ్రహ్మాండమైన గ్రోత్ కారిడార్లు అయినయి’ అని ముఖ్యమంత్రి వివరించారు. ‘నీళ్లు వచ్చిన తర్వాత పాత వరంగల్ జిల్లాలోనే అత్యధికంగ వడ్లు పండించే తాలుకాగా ఇయ్యాల జనగామ తయారైంది. నేను అప్పుడప్పుడు తెలుసుకుంటున్న బ చ్చన్నపేట చెరువు సంగతేమైందని. నేను అప్పడప్పుడు అడుగుతున్న..ఆనాడు ఎండింది కానీ ఇప్పుడు 365 రోజులు నిండే ఉంటాంది.. ఇప్పుడు ఎండిపోయే ప్రశ్నేలేదని అధికారులు చెప్పింన్రు. మా ముత్తిరెడ్డి, బోడకుం టి వెంకటేశ్వర్లు చెబుతుంటే సంబురం అనిపించింది’ అంటూ వివరించారు. ‘జనగామ ఎంత కరువు ప్రాంతం ఉండెనో..ఎన్ని మంచినీళ్లు అమ్ముకునే దుకాణాలు ఉం డెనో అవన్నీ మాయమై చాలా చక్కగా అభివృద్ధి చెందుతున్నది’ అని కేసీఆర్ చెప్పారు.
హైదరాబాద్ సమీప ప్రాంతం కాబట్టి జనగామ వందశాతం అభివృద్ధి చెంది తీరుతుందని, సిటీ పొలిమేర ఉప్పల్, ఘట్కేసర్ దాటిన తర్వాత జనగామ 50, 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి భవిష్యత్లో ఐటీ కారిడార్, పరిశ్రమలతో చాలా అద్భుతంగా మారుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, దేశపతి శ్రీనివాస్, మధుసూదనాచారి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, నాగపురి రాజలింగం, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, సుంకరి మల్లేశం, మున్సిపల్ చైర్మన్ పోకల జమున లింగయ్య, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, ఎంపీపీలు మేకల కలింగరాజు, గోవర్ధన్, నాగజ్యోతి, హరిత, జడ్పీటీసీలు పద్మజ, శ్రీనివాస్, దీపిక, ముదిరాజ్ మహాసభ జిల్లా మహిళ అధ్యక్షురాలు చినబోయిన రేఖ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గాడిపల్లి ప్రేమలతా రెడ్డి, సర్పంచులు, ఎంపీటీల ఫోరం అధ్యక్షులు బొల్లం శారద, బండ లక్ష్మి, గంగం సతీష్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్యదర్శులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
12కు 12 బీఆర్ఎస్ కైవసం ; మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
జనగామ, చేర్యాల ప్రాంతాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎనలేని ప్రేమ ఉందని, అందుకే ఆయన దూతగా నియోజకవర్గానికి పల్లా రాజేశ్వర్రెడ్డిని పంపారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై మంచి ప్రేమ ఉన్నా.. ఆయనకు రాష్ట్రస్థాయిలో మంచి పోస్టు ఇచ్చి పల్లన్నను పంపించారని అన్నారు. జనగామ జిల్లాలో మూడుకు మూడు నియోజకవర్గాలు గెలిపిస్తామని జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, నాయకులందరం కలిసి హామీ ఇస్తున్నామని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12కు 12సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. కేసీఆర్ను ఆశీర్వాదంతో ప్రజల్లోకి వెళ్లి గెలిపిస్తామని దయాకర్రావు స్పష్టం చేశారు. ఈ రోజు మనకొక మంచి వార్త.. జనగామ అభివృద్ధిలో భాగస్వాములైన సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య పార్టీలో చేరడం చాలా సంతోషం కలిగించిందని ఆయన పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని అన్నారు.
తెలంగాణ ఐకాన్.. కేసీఆర్ ; ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
తెలంగాణ అంటేనే కేసీఆర్.. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని జనగామ ఎమ్మెల్యే, టీఎస్ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఢిల్లీలో తెలంగాణ అంటే అదెక్కడుంటుంది అనే వాళ్లని.. కేసీఆర్ రాష్ట్రం సాధించిన తర్వాత పరిపాలన దక్షతతో దేశానికే ఐకాన్గా తెలంగాణను మార్చారని పేర్కొన్నారు. ఒకనాడు బువ్వకు నోచుకోని.. జ్వరం వస్తేనో.. జేజమ్మకు పెడితేనో తెల్లటి మెతుకులు దొరికేవి కానీ ఇప్పుడు భారతదేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. జనగామ జిల్లా ఇచ్చి జిల్లా ఆకృతి తెచ్చి, మెడికల్ కాలేజీ మంజూరు చేసి నిండుగా నీళ్లు ఇచ్చిన ఫలితంగానే ఈ ప్రాంతం సస్యశ్యామలమైందని పేర్కొన్నారు. నాటి జనగామ ఎట్లుండె.. నేడు ఎలా మారిందో మీ కండ్ల ముందున్నదని అని చెప్పారు. రాష్ర్టాధినేత, కాబోయే దేశాధినేతను ఆశీర్వదించేందుకు అశేషంగా తరలివచ్చిన ప్రజలకు ముత్తిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జై తెలంగాణ.. కేసీఆర్ నాయకత్వం.. కేటీఆర్ నాయకత్వం.. పల్లా రాజేశ్వర్రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఎమ్మెల్యే నినాదాలు చేశారు.