మరోసారి గెలుస్తా.. గులాబీ జెండా ఎగురవేస్తానని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయనకు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చీఫ్ విప్ విలేకరులతో మాట్లాడుతూ 2005 నుంచి పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తున్నానని, పార్టీ బీఫారంపై తొలుత కార్పొరేటర్గా, 2009, 2014, 2018లలో ఎమ్మెల్యేగా గెలిచానని, ఈసారి మళ్లీ గెలిచి నియోజకవర్గ ప్రజల సేవకు పునరంకితం అవుతానని చెప్పారు. సమైక్య పాలనలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉమ్మడి జిల్లా నుంచి ఉద్యమించడంతోపాటు నగర అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని డివిజన్లలో పార్కులు, భద్రకాళీ ట్యాంక్ బండ్, చిల్డ్రన్స్ పార్, పెట్ పార్, జయశంకర్ పార్ నిర్మించామని వివరించారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ప్రజా సమస్యల పరిషారానికి విశేషంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.
– హనుమకొండ, ఆగస్టు 22
హనుమకొండ, ఆగస్టు 22: వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో మరోసారి గెలిచి గులాబీ జెండాను ఎగురవేస్తానని ప్రభుత్వ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో చీఫ్ విప్ విలేకరులతో మాట్లాడారు. వరంగల్ పశ్చిమ శాసనసభ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తన పేరును ప్రకటించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన తెలంగాణ వాదులు, గులాబీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. 2005 నుంచి క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తగా పని చేస్తున్నానన్నారు. కార్పొరేటర్గా గెలిచి నగర అధ్యక్షుడి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించానని తెలిపారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచి ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధనకు కొట్లాడానన్నారు. రానున్న రోజుల్లో అందరిని కలుపుకపోతూ మళ్లీ గెలిచి నియోజకవర్గ ప్రజల సేవకు పునరంకితమవుతానని హామీ ఇచ్చారు. తనకు అండగా నిలిచిన గులాబీ శ్రేణులు, పార్టీ నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చీఫ్ విప్ పేర్కొన్నారు.
2009 ఉద్యమ సమయంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఉద్యమాన్ని ముందు ఉండి నడిపించానని చీఫ్ విప్ పేర్కొన్నారు. అదే సమయంలో నగర అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు. ప్రత్యేకంగా కాజీపేట బ్రిడ్జి నిర్మాణం కోసం నాటి ముఖ్యమంత్రి రోశయ్య, తర్వాతి సీఎం కిరణ్కుమార్ రెడ్డిని నిధుల ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తే వారు ఒక రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కాజీపేట బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. 75 కోట్లు మంజూరు చేయగా ఆ పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. నాడు జిల్లా కేంద్రంలో కేవలం ఒక పబ్లిక్ గార్డెన్ మాత్రమే ఉండగా నేడు నగరంలోని అన్ని డివిజన్లలో పారులు ఏర్పాటు చేశామన్నారు. భద్రకాళీ బండ్, చిల్డ్రన్స్, పెట్, జయశంకర్ పారులను అభివృద్ధి చేశామన్నారు. వాడ వాడ, గల్లీ గల్లీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. గ్రంథాలయానికి నిధులు తెచ్చామని, అలాగే కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నట్లు తెలిపారు. మన బడి మన బాధ్యత పేరుతో పాఠశాలలను అభివృద్ధి చేసి మౌలిక వసతుల కల్పించేందుకు కృషి చేసినట్లు చీఫ్ విప్ తెలిపారు.
ప్రజా సమస్యల పరిషారానికి కృషి చేస్తున్నానన్నారు. అపార్ట్మెంట్ దర్శన్, అడ్డా ములాఖత్, కార్మిక మాసోత్సవం, ప్రజలు, ఉద్యోగులతో ముఖాముఖి వంటి కార్యక్రమాలు చేపట్టి నిత్యం ప్రజల్లోకి వెళ్తున్నానన్నారు. వారి సమస్యల పరిషారానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఉంటున్నట్లుగానే భవిష్యత్లోనూ ప్రజలతో ఉంటానన్నారు. సైకిల్ ట్రాక్, కమ్యూనిటీ హాళ్లు, షాదీఖాన, గుసుల్ఖానాలను నిర్మించినట్లు తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత సమర్థవంతంగా అందేలా చూశానని, ఇక ముందు సైతం చూస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు వినయ్ భాస్కర్కు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మన్ వెంకటేశ్వర్లు, లైబ్రరీ చైర్మన్ అజీజ్ఖాన్, మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్సింగ్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రజినీకాంత్, వీరేందర్ పాల్గొన్నారు.