కాజీపేట, మే 11: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. 48వ డివిజన్ పరిధిలోని దర్గా కాజీపేటలో రైల్వే పట్టాల వద్ద ఆర్వోబీ స్థలాన్ని ఆయన అధికారులు, ప్రజాప్రతినిదులతో కలిసి గురువారం పరిశీలించారు. ఆర్వోబీతో ఇండ్లు కోల్పోనున్న ప్రజలతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ ఇన్చార్జి కమిషనర్, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, రైల్వే ఈఈ బదియా అజ్మీరా, ఆర్డీవో వాసుచంద్ర, ఆర్అండ్బీ, కార్పొరేషన్ అధికారులు, దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషాతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఆర్వోబీ నిర్మాణం చేపట్టాలని సూచించారు.
దర్గా కాజీపేటలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీతో మరో ఆర్వోబీ నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు చెప్పారు. అందులో భాగంగా ప్రస్తుతం ఆర్వోబీ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆర్వోబీతో 120 ఇండ్లు పోతున్నాయని, అందుకోసమే ఆర్వోబీని ప్రభుత్వ, వ్యవసాయ పట్టా భూముల నుంచి మళ్లించాలని సంబంధిత అధికారులను కోరామన్నారు. రోడ్డు, రైలు మార్గాలతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించామన్నారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. దీర్ఘకాలంగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివాసముంటున్న పేదలు పట్టాల కోసం ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
కార్మిక చైతన్య మాసోత్సవంలో భాగంగా కార్మిక వాడల్లో పర్యటించి, వారికి సంక్షేమ పథకాల గురించి వివరించనున్నట్లు తెలిపారు. ఎల్లవేళలా నియోజక వర్గ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు. కార్పొరేటర్లు ఎలకంటి రాములు, చెన్నం మధు, తహసీల్దార్ కిరణ్కుమార్, ఆర్ఐ దశరథ రామయ్య, ఆర్ అండ్ బీ డీఈ సురేశ్కుమార్, అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్, ఆర్ అండ్ బీ, మున్సిపల్ డీఈలు మనోహర్, సంతోష్, ఏఈ వెంకటేశ్వర్, బీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పబ్బోజు శ్రీకాంత్చారి, బీఆర్ఎస్ నాయకులు హరినాథ్, ఖాజా బాయ్, ప్రేమ్కుమార్, రమేశ్, కోటిలింగం, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ: పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం, సీఎం కేసీఆర్ భరోసా ఇస్తున్నారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 36 మందికి రూ. 29,19,300 విలువ చేసే సీఎంఆర్ఎస్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందితే సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నియోజకవర్గానికి 5 చెకులు తీసుకురాలేదని, స్వరాష్ట్రంలో ప్రతి డివిజన్కు వందల చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెకులను అందజేస్తోందని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, గుంటి శ్రీనివాస్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజినీకాంత్, డివిజన్ అధ్యక్షులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ : మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ పిలుపునిచ్చారు. గురువారం 11వ డివిజన్లో హోప్ వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, కల్పలత సూపర్ బజార్ ఉపాధ్యక్షుడు ఎండీ షఫీ, బీఆర్ఎస్ నాయకులు దేవరకొండ సురేందర్, దేవి, హోప్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
నయీంనగర్: ప్రభుత్వ కళాశాలల్లోనే చేరాలని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కోరారు. వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం ఆయన అడ్మిషన్ల పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, నిపుణులైన అధ్యాపకులు బోధిస్తున్నారని అన్నారు. అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థినులు పింగిళి కళాశాలలోనే చేరాలని ఆయన కోరారు. అనంతరం పింగిళి కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి మాట్లాడుతూ విద్యార్థినులు మొదటి ప్రాధాన్యతను పింగిళి కళాశాలకు ఇవ్వాలని, అంతేకాకుండా కళాశాలలో ఉన్న హాస్టల్ను వినియోగించుకోవాలని కోరారు. వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రామకృష్ణారెడ్డి, అకడమిక్ కోఆర్డినేటర్ పార్వతి, అడిషనల్ కంట్రోలర్ రేణుక, శిరీష, లైబ్రరీ ఇన్చార్జి జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.