హనుమకొండ, నవంబర్ 25 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 28న బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఓరుగల్లు నగరానికి వస్తున్నారని పశ్చిమ నియోజక వర్గం అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. శనివారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రాక సందర్భంగా వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు కలిపి కేఎంసీ మైదానంలో లక్ష మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొన్ని రోజులుగా ప్రజాశీర్వాద యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. అలాగే, తను 50 వేల భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమాను వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు ఉద్యమకారుడికి, ఉద్యమ ద్రోహికి మధ్య జరుగుతున్నాయన్నారు. పార్టీలకతీతంగా ప్రజలు తనను ఆశీర్వదిస్తున్నారని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోరబోయిన సాంబయ్య తిరిగి గులాబీ కుటుంబానికి రావడం చాలా సంతోషంగా ఉందని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. అతడితోపాటు లక్క రంజిత్, రవీందర్, మెట్టు నర్సింగరావు, రజిని, శశి తదితరులు పార్టీలో చేరగా వారికి వినయ్ భాస్కర్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం కోరబోయిన సాంబయ్య మాట్లాడుతూ 2001 నుండి బీఆర్ఎస్తో అనుబంధం ఉందని, ఉద్యమ సమయంలోనూ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాని తెలిపారు. అనుకోని పరిస్థితుల్లో బీజేపీలో చేరినప్పటికీ అక్కడ అన్ని ఇబ్బందులే ఉన్నాయన్నారు. ఆ పార్టీలో బీసీలకు ప్రాధాన్యం లేదన్నారు. దాస్యం వినయ్భాస్కర్ పిలుపు మేరకు తిరిగి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎనికల ఇన్చార్జి మర్రి యాదవరెడ్డి, కన్వీనర్ జనార్దన్ గౌడ్, సీనియర్ నాయకులు నార్లగిరి రమేశ్, మున్నూరు కాపు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కటకం పెంటయ్య, మాజీ కార్పొరేటర్ మర్రి జనార్దన్ పటేల్, కనుకుంట్ల రవికుమార్, పెరుకారి శ్రీధర్రావు, శాగర్ల శ్రీనువాస్ పాల్గొన్నారు.
గౌడ కులస్తులకు అండగా ఉంటానని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ బంధువుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వినయ్ భాసర్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత గౌడల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. గౌడ కులస్తులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి మద్దతు తెలపడం సంతోషకరంగా ఉందన్నారు. నీరా కేఫ్లను నియోజకవర్గంలో ప్రారంభించడానికి కృషి చేస్తానన్నారు. గౌడ సంఘం రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ గట్టు రమేశ్, శ్రీపతి గోపి గౌడ్, వెంకటేశ్వర్లు, గొడిశాల సూరజ్ , విద్యాసాగర్, వేణుగోపాల్, చిర్ర రాజు, ముసి గుంపుల అంజయ్య, చిర్ర ఉపేందర్, కోలవినోద, ఏరుకొండ హైమావతి, గడ్డం రాజు, చిర్ర వెంకటస్వామి, ్ర్ల రాజు, కరుణ, ప్రశాంత్ పాల్గొన్నారు.
57వ డివిజన్ గాంధీనగర్లో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చెరుకు వెంకటరాజిరెడ్డి ఆధ్వర్యంలో వినయ్ భాసర్ గెలుపు కోసం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వినయ్భాస్కర్ హాజరై తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నల్ల స్వరూపా రాణి సుధాకర్రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, నక లింగయ్య యాదవ్, మూగల కుమార్ యాదవ్, శాగర్ల శ్రీనివాస్, కమలాకర్రావు, జనార్దన్రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మైనార్టీలకు అండగా నిలిస్తున్నారని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో మహ్మద్ ఖుద్దూస్ అధ్యక్షతన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. అంతకు ముందు ఉదయం రాంనగర్లోని నిత్యా బ్వాంకెట్ హాల్లో ఇమామ్ మౌజ్లు విలేకరులతో మాట్లాడుతూ వినయ్ భాస్కర్కే తాము మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ మౌలానా యూసుఫ్ జాహీద్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ మర్రి యాదవ రెడ్డి, మైనారిటీ రాష్ట్ర నాయకులు ఇబ్రహీం, కల్పలత సూపర్ మారెట్ వైస్ చైర్మన్ షఫీ, మాజీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, మత పెద్దలు అబ్దుల్ మజీద్, మౌలానా అయూబ్ కాశ్మీ, ఉమ్మడి జిల్లా మైనార్టీ అధ్యక్షుడు నయీమొద్దీన్, నాయకులు ఖలీల్, సోనీ, జుబేర్, ఇస్మాయిల్, జమీలుద్దీన్ పాల్గొన్నారు.