నయీంనగర్, మే 24 : కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ పోచమ్మకుంటలోని పీహెచ్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక కార్పొరేటర్ గుంటి రజితా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించే సంపూర్ణ ఆరోగ్య పరీక్షల కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్మిక గుర్తింపు కార్డు ఉన్న వారందరూ ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 23 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, ఈ కార్యక్రమ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 19వేల మంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు మే 31న భారీ ర్యాలీ, బహిరంగ సభ ముఖ్యఅతిథిగా మంత్రి హరీశ్రావు హాజరుకానున్నట్లు తెలిపారు. మే 1 నుంచి 31 వరకు సంక్షేమ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు, మే నెలంతా కార్మికుల సంక్షేమం, ఆరోగ్యం, విద్య, వైద్యం, పలు అంశాలపై సమగ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గంలోని పలువురు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ శ్రమశక్తి అవార్డు గ్రహీలను అందించి ఘనంగా సన్మానించారు. మోహన్, కేసోజు ప్రణయ్, సురారి కృష్ణ పాల్గొన్నారు.
బాలసముద్రం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో..
హనుమకొండ: రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శ్రమశక్తి అవార్డు పొందిన వారికి కార్మిక సంక్షేమ మహోత్సవంలో భాగంగా హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్పార్టీ కార్యాలయంలో బుధవారం సాయం త్రం ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ ప్రతి కార్మికుడికి లేబర్ కార్డుపై అవగాహన కల్పించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి మెగా హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల 31న ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం గ్రౌండ్లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యే కార్మిక మాసోత్సవ ముగింపు సభను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ శ్రమశక్తి అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, భవన నిర్మాణ కార్మిక రంగాల అధ్యక్షులు జంజాల మల్లేశ్, జాన్షన్, సారంగపాణి, షేక్జానీ పాల్గొన్నారు.
అభివృద్ధిని గుర్తించి ఆశీర్వదించండి
హనుమకొండ సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించి వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో బుధవారం వాకర్స్ ఇంటర్నేషనల్, పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరైన మాట్లాడారు. పబ్లిక్గార్డెన్లోని సమస్యలపై అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు చల్లా లింగారెడ్డి, అధ్యక్షుడు తకళ్లపల్లి శ్రీనివాస్ కమిటీ అభ్యర్థన మేరకు త్వరలోనే సమస్యలను పరిషరిస్తానని హామీ ఇచ్చారు. మొదట కొత్త కమిటీని ఘనంగా సతరించారు. కార్పొరేటర్ దాస్యం అభినవ్భాసర్, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు తడక కుమారస్వామి, సారంగపాణి, ఎల్లగౌడ్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, భారతి, గిరిజ, అన్నపూర్ణ, మాజీ అధ్యక్షుడు జాన్ మొహమ్మద్, దేవానంద్, కమిటీ సభ్యులు విజయ్కుమార్, కుమారస్వామి, గాంధీ, చంద్రమౌళి, జ్యోతి, రవికుమార్, సురేష్, రవి, వీణ, విజయ్, హరి, సందీప్ పాల్గొన్నారు.