నర్సంపేట, డిసెంబర్ 30: దేశంలో బీఆర్ఎస్ సర్కారు ఏర్పడితే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట 16వ వార్డులోని వివిధ పార్టీలకు చెందిన 120 మంది శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పెద్ది వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టారని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి అనేక పార్టీల వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వేల్పుగొండ పద్మరాజు, పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, రాధమ్మ, సరళ, ప్రభుదాస్, రవి, కుమార్ పాల్గొన్నారు.
అభివృద్ధి నివేదికలు తయారు చేయాలి
గ్రామాల్లో అభివృద్ధి నివేదికలు తయారు చేయాలని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. గ్రామాల అభివృద్ధిపై ఆయన క్యాంపు కార్యాలయంలో నర్సంపేట నియోజకవర్గంలోని అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. సంక్షేమ పథకాలు పొందిన వారి వివరాలను గ్రామాల వారీగా తయారు చేయాలన్నారు. నిర్మాణాల్లో ఉన్న మహిళా సమైక్య భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. సమీక్షలో జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.