తాడ్వాయి, డిసెంబర్ 28 : మేడారం సమ్మక్క, సారలమ్మల హుండీల ద్వారా రూ. 39,84,959 ఆదాయం లభించింది. గత సెప్టెంబర్ మాసంలో అమ్మవార్ల గద్దెలపై 22 హుండీలు ఏర్పాటు చేయగా అవి భక్తులు వేసిన కానుకలతో నిండుకోవడంతో గురువారం దేవాదాయ శాఖ అధికారులు అమ్మవార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు, రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో లెక్కింపును ప్రారంభించారు. సమ్మక్క హుండీల్లో రూ. 23,43,970, సారలమ్మ హుండీల్లో 14,55,925, గోవిందరాజు హుండీల్లో రూ. 94,096, పగిడిద్దరాజు హుండీల్లో రూ. 88,096 లభించినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు.