‘తెలంగాణల పల్లెలు, తండాల్లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి తాండవమాడుతున్నయ్.. ఈ అభివృద్ధి ఇట్లనే కొనసాగాలంటే మీ ఆశీర్వాదం ఉండాలె.. బీఆర్ఎస్ను గెలిపించాలె’ అని ప్రజలకు బీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మానుకోట శివారులోని శనిగపురంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అధ్యక్షతన నిర్వహించిన మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ, సాయంత్రం ఓరుగల్లు శివారులోని భట్టుపల్లిలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. శంకర్ నాయక్ను గెలిపిస్తే మానుకోట మరింత అభివృద్ధి చెందుతుందని, అరూరిని లక్ష మెజారిటీతో గెలిపిస్తే వర్ధన్నపేట మరింత బాగుపడుతుందని చెప్పారు. సభలకు తరలివచ్చిన జనాన్ని చూస్తే ఇద్దరి గెలుపు ఖాయమైందని, ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు మహబూబాబాద్కు మరిన్ని విద్యా సంస్థలు వస్తాయని, వర్ధన్నపేట పరిధిలో ల్యాండ్ పూలింగ్ ఉండబోదని, విలీన గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, సాదా బైనామాలకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వరంగల్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ మహబూబాబాద్, (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో అభివృద్ధి ఇట్లనే కొనసాగాలంటే మీ ఆశీర్వాదం ఉండాలె.. బీఆర్ఎస్ను గెలిపించాలె’ అని ప్రజలకు బీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో శుక్రవారం నిర్వహించిన మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. మధ్యాహ్నం మానుకోట సభలో కేసీఆర్ మాట్లాడుతూ ‘తెలంగాణ వచ్చిన తర్వాత తండాలు ధాన్యలక్ష్మి, ధనలక్ష్మితో కళకళలాడుతున్నాయి.. ఒకప్పుడు మానుకోట.. ఇప్పుడు మానుకోటను చూస్తే అభివృద్ధి ఎలా జరిగిందో మీకే గుర్తొస్తుంది.. శంకర్ నాయక్ను గెలిపిస్తే మానుకోట మరింత అభివృద్ధి చెందుతుందని’ అని చెప్పారు. తెలంగాణ వచ్చింది కాబట్టే మహబూబాబాద్ను జిల్లాగా చేసుకున్నామని, ఆ ఫలితాలు మన కళ్లముందు కనిపిస్తున్నాయని, ఆకేరు, మున్నేరు వాగుల పొడుగుతా నీళ్లు పుషలంగా ఉన్నాయని, అద్భుతంగా పంటలు పండుతున్నాయని వివరించారు. ‘ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. ఎవరొచ్చినా ఎనికల్లో ప్రజలే గెలవాలి’ అని పేర్కొన్నారు. ‘రెండు ఎలక్షన్లలో శంకర్ నాయక్ను గెలిపించినందుకు నియోజకవర్గ అభివృద్ధిని చూస్తున్నారు. మీ ఊర్లకు పోయి నేను చెప్పినదాని మీద చర్చించండి..
నిజమెంటో తెలుసుకోండి’ అని సూచించారు. ‘మాకు పరిశ్రమలు రావాలి, బయ్యారం ఉకు పరిశ్రమ రావాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే వాటంతటవే వస్తాయి’ అన్నారు. ప్రధానమంత్రి రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరెంటు సరఫరా లేదని, వాళ్లు వచ్చి ఇకడ ధర్నాలు చేస్తున్నరని ఎద్దేవా చేశారు. ‘నాడు ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టినం.. నేడు పుషలంగా ఎరువుల లభ్యమవుతున్నయి. ధాన్యం అమ్మితే నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు జమవుతున్నది. రైతు బందు డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తున్నాయి. ధరణితో లాభాలే ఉన్నాయి కానీ, నష్టాలు లేవు. ధరణి లేకుంటే మళ్లీ కథ మొదటికే వస్తది. పైరవీ కారులు, లంచాల వ్యవహారం మొదటికొస్తయి.. బీఆర్ఎస్ సరార్ ఉంటే ఎటువంటి పైరవీలకు ఆస్కారం ఉండదు’ అని స్పష్టం చేశారు. ధరణిని ఎత్తేస్తామంటున్న కాంగ్రెస్ను బంగాళాఖాతంలోకి విసిరేయాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో 25 వేల ఎకరాలకు పోడు పట్టాలిచ్చామని, పోలీస్ కేసులను రద్దు చేశామని చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పింఛను 16వేలు ఇస్తామని, మహిళలకు 3వేల పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ, హార్టికల్చర్ డిగ్రీ కాలేజీ నడుస్తున్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని విద్యా సంస్థలను కూడా పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ అభివృద్ధి ఇట్లనే కొనసాగాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంత భారీ ఎత్తున ప్రజలు తరలిరావడం చూస్తుంటే బీఆర్ఎస్ విజయం ఖాయమైందన్నారు. మానుకోట బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
‘ఉద్యమం మొదలుపెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తదని నమ్మకం లేకుండే. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని బయలుదేరిన. 14 ఏండ్ల ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చింది. వచ్చిన రాష్ట్రం కొత్త కుండలో ఈగ సొచ్చినట్లుండె. మంచిగ చేసుకున్నం. పేదల సంక్షేమంలో మనమే ముందున్నం. అన్ని వర్గాలకు భరోసా కల్పించుకున్నం. అందరినీ సమానంగా చూస్తున్నం. కరెంటు, మంచినీళ్లు, తాగునీరు దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన దగ్గర ఉన్నది. అందరు అన్నీ చూస్తున్నరు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.. దేశంలో ఎక్కడా ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ కట్టుకోలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లల కోసం వెయ్యికి పైగా గురుకులాలు పెట్టుకున్న రాష్ట్రం ఎక్కడా లేదు. ఇవన్నీ మీరు చూస్తున్నరు. కొందరు మాత్రం తెలంగాణపై పెత్తనం, అధికారం కోసం అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నరు. వాళ్ల కడుపుల మాటలు ఇప్పుడు బైటపడుతున్నయ్. 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ హయాంలో ఎరువులు, కరెంటు, తాగునీళ్లు, సాగునీళ్లు, సంక్షేమం పరిస్థితి ఎట్లుండె?. కాంగ్రెస్ రాజ్యంల వ్యవసాయం మీరు చూసిండ్లు.
మందుబస్తాలకు గోస పడ్డం. రైతు బంధు ఇయ్యొద్దని కాంగ్రెస్ జాతీయ నేత ఫిర్యాదు చేసిండు. కరెంటు మూడు గంటలు ఉంటే చాలని రేవంత్రెడ్డి అంటున్నడు. మీ వేలి ముద్ర లేనిదే మీ భూమిని ఎవరు ముట్టకుండా ధరణిని తెచ్చినం. కాంగ్రెస్ హయాంల ఇవేం లేవు. మింగుడు బంధు ఒక్కటే ఉండేది. వాళ్లకు వస్తే ఎవరికీ వ్యవహారం చేయరాదు. బీఆర్ఎస్ మళ్లీ గెలువాలె. లేకుంటె ఆగమవుతం. మనం ఆదాయం పెం చుకుంటూ ప్రజలకు పంచుకుంటున్నం. మళ్లీ అధికారంలోకి రాగానే ఇంకా మంచిగ చేసుకుందాం.’ అని చెప్పా రు. కార్యక్రమాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసన మండలి డిప్యూటీ చైర్మెన్ బండా ప్రకాశ్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సార య్య, దేశపతి శ్రీనివాస్, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, నన్నపునేని నరేందర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మ న్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, గ్యాదరి బాలమల్లు, వరంగల్, మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్లు గండ్ర జ్యోతి, అంగోత్ బిందు, మానుకోట మున్సిపల్ చైర్మన్ పాల్వా యి రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, ఎల్లావుల లలితాయాదవ్ పాల్గొన్నారు.
భట్టుపల్లిలో జరిగిన వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ నగరంలో విలీన గ్రామాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. శివారు ప్రాంతాల్లోని వారికి సాదాబైనామా అవకాశం కల్పిస్తామని చెప్పారు. రింగ్ రోడ్డుగాని, దీని కోసం ల్యాండ్ ఫూలింగ్ గానీ లేవని, ఇందుకు తాను గ్యారంటీ అని చెప్పారు. ‘అరూరి రమేశ్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గం మంచిగ అభివృద్ధి చెందింది. ఎస్సారెస్పీ కాల్వలు బాగు చేసుకున్నం. ఆకేరు వాగుపై చెక్ డ్యాంలు కట్టుకున్నం. ఐనవోలు, హసన్పర్తి మండలాలకు దేవాదుల నీళ్లు వచ్చినయ్.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కలిసి నీళ్ల వసతి పూర్తి చేసుకున్నరు. అంతటా పంటలు బాగా పండుతున్నయి. అరూరి రమేశ్ ప్రజల్లో ఉండే నాయకుడు, మంచి నాయకుడు. సింపుల్ వ్యక్తి. వర్ధన్నపేటను కొత్తగా మున్సిపాలిటీ చేసి రూ.160 కోట్లలో అభివృద్ధి చేసిండు. రింగురోడ్డు కోసం ల్యాండ్ పూలింగ్ అని ఏదో అంటున్నరు. అరూరి రమేశ్పై నేరుగా గెలిచే దమ్ము లేక వంకర పద్ధతులతో వస్తున్నరు. రింగ్ రోడ్డుకు పూనింది లేదు ఏదీ లేదు. రింగ్ రోడ్డు ల్యాండ్ ఫూలింగ్ లేదు. దీనికి నాదీ గ్యారంటీ. వరంగల్ను సమగ్రంగా అభివృద్ధి చేసుకున్నం. వర్ధన్నపేట వరంగల్ నగరంలో కలిసిపోయింది. 42 గ్రామాలు నగరంలో విలీనమయ్యాయి. ఈ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులిస్తా. ఇక్కడి ప్రజల కోసం సాదా బైనామాకు అవకాశం ఇస్తం. వరంగల్ నగరాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా, ఉద్యోగాల కల్పనలో ముందుకు తీసుకుపోతున్నం. అరూరి రమేశ్ గెలుపు ఖాయమైంది. ఈ సభకు వచ్చిన జనమే విజయాన్ని రుజువు చేస్తున్నరు. ఒకసారి 80 వేల మెజారిటీ, రెండోసారి 90 వేల మెజారిటీతో రమేశ్ను గెలిపించారు. ఈసారి మెజారిటీ లక్ష దాటాలె. నా కన్నా ఎక్కువ రావాలె’ అని సీఎం కేసీఆర్ అన్నారు.