దామెర/ఆత్మకూరు, నవంబర్ 8 : వందల కోట్లతో పరకాల నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసిన తనను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. బుధవారం దామెర మండలం దమ్మన్నపేట, ఓగులాపురం, పసరగొండ, పులుకుర్తి, ఆత్మకూరు మండలంలోని కామారం, తిరుమలగిరి, ఆత్మకూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు చెరువుల్లో నీరు ఉండేది కాదని, ఇప్పుడు పుష్కలంగా నీరు ఉంటుండడంతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని, రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు. కళ్లాల వద్దే పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయన్నారు. ఒకప్పుడు రూ.200 ఉన్న పెన్షన్ను రూ.2016కి పెంచామని, దాన్ని రూ.5వేలకు పెంచి ఇవ్వనున్నట్లు చెప్పారు. టెక్స్టైల్ పార్కులో వేలాది ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి ఏనాడైనా ప్రజలను పట్టించుకున్నాడా? అని ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ పార్టీకి ఓటు వేస్తే సర్వనాశనం అవుతుందన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మితే తెలంగాణ ప్రజలంతా ఢిల్లీకి గులాంగిరీ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పాలనలో పచ్చబడ్డ గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
జనధన్ యోజన కింద ఒక్కొక్కరికి రూ.15లక్షల ఇస్తామన్న మాట ఏమైందని బీజేపోళ్లను నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ నాయకు లు భయపెట్టాలని చూస్తే తమ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. పరకాల గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని స్పష్టం చేశారు. ఎంపీపీ కాగితాల శంకర్, జడ్పీటీసీ గరిగె కల్పన, వైస్ ఎంపీపీ జాకీర్అలీ, పీఏసీఎస్ చైర్మన్ బొల్లు రాజు, సర్పంచ్లు పుల్యాల రాణి-రఘుపతిరెడ్డి, కేతిపల్లి సరోజనారెడ్డి, మేడిపల్లి సాంబయ్య, గోవిందు అశోక్, ఎంపీటీసీలు పోలం కృపాకర్రెడ్డి, గండు రామకృష్ణ, గోవిందు సంధ్య-అశోక్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ బిల్లా రమణారెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ముదిగొండ కృష్ణమూర్తి, యూత్ మండలాధ్యక్షుడు మెంతుల రాజు, ఏఎంసీ డైరెక్టర్ కౌటం మోహన్, కేతిపల్లి శ్రీధర్రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అక్తర్, పీఏసీఎస్ డైరెక్టర్లు గుండా చంద్రమోహన్, దుబాసి అనిల్, పాండవుల భిక్షపతి, ఎడ్ల గోపాల్, సిలివేరు నర్సయ్య, దుబాసి నవీన్, దాడి మల్లయ్య, దాడి రమేశ్, చెక్క కృష్ణ, బత్తిని రాజు, జానపట్ల సుమలత, కాశెట్టి సదానందం, దురిశెట్టి రమేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కంది శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు రంపీస మనోహార్, కోట స్వరూప-సంజీవ్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఎనకతాళ్ల రవీందర్, నాయకులు పాపని రవీందర్, వీర్ల వెంకటరమణ, వంగాల స్వాతీ-భగవాన్రెడ్డి, ఎండీ అంకుస్, బాషబోయిన పైడి, రేవూరి ప్రవీణ్రెడ్డి, తోట కుమారస్వామి, కాసర్ల శ్రీనివాస్, కానుగంటి సంపత్కుమార్ పాల్గొన్నారు.