బీఆర్ఎస్ ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. సబ్బండ వర్గాల మద్దతు లభిస్తుండడంతో అభ్యర్థుల్లో జోష్ కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఊరూరా, వాడవాడనా కలియదిరుగుతున్న అభ్యర్థులు ‘నియోజకవర్గ ప్రజలే మా బలం.. బలగం.. మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి’ అంటూ ప్రజలను కోరుతున్నారు.
ప్రచారంలో భాగంగా శనివారం తొర్రూరు మండలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, స్టేషన్ఘన్పూర్లో కడియం శ్రీహరి, జనగామలో పల్లా రాజేశ్వర్రెడ్డి, నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్రెడ్డి, పరకాలలో చల్లా ధర్మారెడ్డి, భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లో వొడితల సతీశ్ కుమార్, టేకుమట్లలో గండ్ర వెంకటరమణారెడ్డి, తాడ్వాయిలో బడే నాగజ్యోతి, మహబూబాబాద్లో బానోత్ శంకర్నాయక్, నర్సింహులపేటలో డీఎస్ రెడ్యానాయక్ జోరుగా ప్రచారం నిర్వహించారు. పేదలకు అండగా ఉండే బీఆర్ఎస్ను గెలిపించి మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.