వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నర్సంపేట-వరంగల్ రహదారిపై బిట్స్ కాలేజీ సమీపంలో లక్నెపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి చెందారు. నర్సంపేట నుంచి వరంగల్ వైపు వెళ్తున్న బైక్ను టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖానాపురం మండలం దబ్బిర్పేట గ్రామానికి చెందిన రాకేశ్, ప్రసన్న మృతి చెందారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇద్దరి మృతదేహాలను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.