వర్ధన్నపేట, జూలై 4 : రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు ఆదరిస్తారని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని దివిటిపల్లికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు బుంగ రవీందర్ ఆధ్వర్యంలో పలువురు బీజేపీ కార్యకర్తలు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గ్రామంలో గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసీఆర్ ఉద్యమించారని తెలిపారు. సీఎంగా తొమ్మిదేళ్లలోనే రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం ఇతర అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. పట్టణాలు, పల్లెలను సమగ్రంగా అభివృద్ధి చేస్తూ పేదలు ఆర్థికంగా ప్రగతి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అందుకే ఇతర పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. దశాబ్దాలుగా పరిపాలించిన పార్టీలు తెలంగాణకు చేసిందేమీలేదన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టించేలా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. పథకాలు, అభివృద్ధిలో పారదర్శకత లోపించకుండా, అర్హులైన పేదలకే అందేలా పనిచేస్తున్న బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని వివరించారు. కాగా, దివిటిపల్లికి చెందిన జోగు సమత అనారోగ్యంతో మృతిచెందగా కుటుంబాన్ని ఎమ్మెల్యే రమేశ్ పరామర్శించారు. మృతదేహంపై పూలమాల ఉంచి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందిం చా రు. పీఏసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్ ఖన్న, సర్పంచ్ బుంగల లత, ఉపసర్పంచ్ యాకయ్య, మహేందర్, బుచ్చిరెడ్డి, మధుసూదన్రెడ్డి, కందిక సారయ్య పాల్గొన్నారు.