జిల్లాలోని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదులుతున్నారు. ఈ ఏడాది 2.06 కోట్ల పిల్లల్ని జలాశయాల్లో వదలాలని ప్రభుత్వం నిర్దేశించింది. మొత్తం 745 చెరువుల్లో వదిలేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే మాదన్నపేట చెరువు, మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో విడుదల చేశారు. మిగతా వాటిల్లో దశల వారీగా వదులుతున్నారు. అనంతరం ఐదు చెరువుల్లో వంద శాతం సబ్సిడీపై రొయ్య పిల్లలను విడుదల చేయనున్నారు. ఏటా మత్స్యకారులకు సర్కారు ఉచితంగా చేప పిల్లలను అందజేస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు పాటుపడుతున్నది. దీంతో జిల్లావ్యాప్తంగా 172 మత్స్య సహకార సంఘాల్లోని 13,650 మందికి లబ్ధి కలుగుతున్నది.
వరంగల్, సెప్టెంబర్6(నమస్తేతెలంగాణ): ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు చెరువుల్లో చేప పిల్లలను విడు దల చేస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి రంగంలో కుల వృ త్తులను ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి సంవ త్సరం నూరుశాతం సబ్సిడీపై మత్స్యకారులకు ఉచితం గా వివిధ రకాల చేప పిల్లలను అందజేస్తుంది. చెరు వుల్లో పెరిగే వీటిని పట్టుకుని మార్కెట్లో అమ్మడం ద్వారా ఏటా మత్స్యకారులు ఆదాయాన్ని పొందుతు న్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభు త్వం జిల్లాలోని మత్స్యకారులకు 2.06 కోట్ల చేప పిల్ల లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మత్స్యశాఖ అధికారులు ప్రణాళిక రూపొందిం చారు. జిల్లాలో 745 చెరువులు ఉన్నాయి. వీటి పరి ధిలో 172 మత్స్య సహకార సంఘాలు పనిచేస్తున్నా యి.
ఈ సంఘాల్లో ప్రత్యేకంగా కొన్ని మహిళా మత్స్య సహకార సంఘాలు కూడా ఉన్నాయి. 13,650 మంది మత్స్యకారులు సభ్యత్వం కలిగి ఉన్నారు. వీరందరూ జిల్లాలోని 745 చెరువుల్లో చేపలు పట్టు కుని ఉపాధి పొందుతున్నారు. ఈ ఏడాది జిల్లాలోని చెరువుల్లో పెంపకానికి మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఇటీవల టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. టెండర్లను దక్కించు కున్న చేప పిల్లల కాంట్రాక్టర్లు జిల్లాలోని 745 చెరు వుల్లో విడుదల చేసేందుకు అవసరమైన 2.06 కోట్ల చేప పిల్లలను సరఫరా చేసేందుకు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వంతో అగ్రిమెంటు చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఈ కాంట్రాక్టర్లు 2.06 కోట్ల చేప పిల్లల్లో మూ డు నుంచి నాలుగు ఇంచుల పెద్ద సైజ్ చేప పిల్లలను 27 లక్షలు సరఫరా చేయనున్నారు. ఇటీవల విస్తా రం గా కురిసిన వర్షాలతో అన్ని చెరువుల్లోనూ నీరు నిండి ఉండడంతొ వల్ల చేప పిల్లలను వదులుతున్నారు. ఇప్పటికే నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు, రాయపర్తి మండలంలోని మైలారం రిజర్వా యర్లో చేప పిల్లలను వదిలారు.
మూడు రకాల చేప పిల్లలు..
మైలారం రిజర్వాయర్తోపాటు వర్ధన్నపేట మండ లంలోని దమ్మన్నపేట, కోనారెడ్డి, నర్సంపేట మండ లంలోని మాదన్నపేట, సంగెం మండలంలోని ఎల్గూ రురంగంపేట చెరువులో పెద్దసైజ్ చేప పిల్లలను విడు దల చేస్తున్నారు. బొచ్చె, రవ్, మెరిగె రకాలు పెద్ద సైజ్ చేప పిల్లల్లో ఉంటాయని, సంవత్సరం పొడవునా నీరు ఉండే ఐదు చెరువుల్లో వీటిని వదులుతున్నారు. మిగ తా 140 చెరువుల్లో ఇంచుకుపైగా ఉండే 1.79 కోట్ల చిన్న సైజ్ చేప పిల్లలను వదులుతామని మత్స్యశాఖ జిల్లా అధికారి నరేశ్కుమార్నాయుడు వెల్లడించారు. బొచ్చె, రవ్తో పాటు బంగారుతీగ రకాలు ఈ చిన్నసైజ్ చేప పిల్లల్లో ఉంటాయని ఆయన చెప్పారు. జిల్లాలోని 745 చెరువుల్లో ఈ ఏడాది ఉచిత చేప పిల్లలను వదులుతున్నట్లు తెలిపారు.
ఐదు చెరువుల్లో రొయ్యపిల్లలు
ఈ ఏడాది జిల్లాలో ఐదు చెరువుల్లో ఉచిత రొయ్య పిల్లలను కూడా వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మైలారం రిజ ర్వాయర్తోపాటు దమ్మన్నపేట, కోనారెడ్డి, మాదన్నపే ట, ఎల్గూరు రంగం పేట చెరువుల్లో రొయ్య పిల్లలను వదిలే అవకాశం ఉంది. చెరువుల్లో ఉచిత చేప పిల్లలను వదల డం పూర్తి కాగానే మరో నెల రోజుల్లో వంద శాతం సబ్సిడీపై రొయ్య పిల్లలను విడుదల చేయాలనే ఆలోచనలో మత్స్యశాఖ అధికారులు ఉన్నారు. ఈ ఐదు చెరువుల్లో ఎన్ని రొయ్య పిల్లలను వదలాలనే అంశంపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.