వరంగల్ : కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అసిస్టెంట్ ఇంజినీర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏఈ రమేష్ హనుమకొండ జిల్లా విద్యా శాఖ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేన్నాడు. కాగా, గురువారం హనుమకొండ అదాలత్లోని జిల్లా విద్యా శాఖ కార్యాలయం ఇంజనీర్ విభాగం ఆఫీసులో కొడకండ్లలోని స్కూల్ బిల్డింగ్ కాంట్రాక్టర్ నుంచి రూ.8 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
గతంలో స్కూల్ బిల్డింగ్ నిర్మాణ పనుల బిల్లుల కోసం కాంట్రాక్టర్ను ఏఈ రూ.18 వేలు డిమాండ్ చేయగా రూ10 వేలు ఇచ్చాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు.