పరకాల, నవంబర్ 30 : అసెంబ్లీ ఎన్నికలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. పోలింగ్ ముగిసే వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, పరకాలలోని మాదారం కాలనీలో ఏర్పాటు చేసిన హిస్టారికల్ పోలింగ్ బూత్, బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన మహిళా పోలింగ్ సేష్టన్ పలువురిని ఆకర్షించింది. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకునే యువతీ యువకులు ఉత్సాహంగా ఓటు వేశారు. ఏసీపీ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
ఆత్మకూరు : మండలంలోని అన్ని గ్రామాల్లో రాత్రి 7:30 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఆత్మకూరు, నీరుకుళ్ల, అక్కంపేట, కామారం, కటాక్షపురం, పెంచికలపేట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి కామారం, పెద్దాపురం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఆత్మకూరులో ఏర్పాటు చేసిన ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అబ్జర్వర్ రాహుల్ పంజాబ్రావు, జనరల్ అబ్జర్వర్ గోపాల్కృష్ణ సందర్శించారు. సీఐ రవిరాజు, ఎస్సైలు ప్రసాద్, రాజేశ్రెడ్డి బందోబస్తు నిర్వహించారు. పోలింగ్కేంద్రాలను తహసీల్దార్ సురేశ్కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి పరిశీలించి,సంబంధిత అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
దామెర : మండలంలోని పులుకూర్తి, దామెర గ్రామాల్లో సాయంత్రం వరకు పోలింగ్ జరిగింది. మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల జనరల్ అబ్జర్వర్ గోపాలకృష్ణ సందర్శించారు. అలాగే, దామెరలో ఎన్నికల సరళిని బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. కాగా, తక్కళ్లపహాడ్లో 894, దుర్గంపేటలో 669, దమ్మన్నపేటలో 565, సింగరాజుపల్లిలో 1017 ఓట్లు పోలయ్యాయి. పులుకుర్తిలో 2133, వెంకటాపురంలో 470, సీతారాంపురంలో 486, ముస్త్యాలపల్లిలో 1017, ల్యాదెళ్లలో 1808్ల, దామెరలో 3245, ఊరుగొండలో 2742, ఓగ్లాపురంలో 714, కోగిల్వాయిలో 1867 ఓట్లు పోలయ్యాయి. పసరగొండలో రెండు బూత్లో రాత్రి వరకు ఓటింగ్ జరుగుతోంది.
గీసుగొండ : మండలంతో పాటు 15,16వ డివిజన్లోని 52 బూత్లలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. రాత్రి 8 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఏఆర్వో రియాజుద్దీన్ తెలిపారు. కాగా, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలైన గీసుగొండ, ధర్మారాన్ని సీపీ అంబర్ కిశోర్ ఝా, వరంగల్ ఈస్ట్ట్ జోన్ డీసీపీ రవీందర్తో కలిసి సందర్శించారు. కార్యక్రమంలో సీఐ రామకృష్ణ , ఎస్సై వెంకన్న పాల్గొన్నారు. కాగా, మండలంలోని ఎలుకుర్తి, కొమ్మాల, గీసుగొండ, ధర్మారం, కోనాయిమాకుల, దస్రుతండా, మచ్చాపురం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి సందర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్లు వీరాటి కవిత, నాగేశ్వర్రావు, పూండ్రు జైపాల్రెడ్డి, బోడకుంట్ల ప్రకాశ్, సరోజ, దౌడు బాబు, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నడికూడ : మండలంలోని రామకృష్ణాపురం, కంఠాత్మకూర్లో 85శాతం, ధర్మారంలో 86శాతం, సర్వాపురం, కౌకొండలో 85శాతం, నడికూడలో 83శాతం, నర్సక్కపల్లి, రాయపర్తి, పులిగిల్ల, వరికోల్, నార్లాపూర్లో 86.5శాతం, వెంకటేశ్వర్లపల్లి, చర్లపల్లి, చౌటుపర్తిలో 86శాతం, ముస్త్యాలపల్లిలో 91శాతం పోలింగ్నమోదైంది. పలు పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. వరికోల్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో పాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, మండలంలో పురుషుల కంటె మహిళలదే పోలింగ్ శాతం అధికంగా ఉండటం గమనార్హం. కాగా, ఎన్నికల్లో ఓటు వేయడానికి యువత ఆసక్తి చూపింది. మండల కేంద్రంలో కవల సోదరులు గోళ్ల రామ్, లక్ష్మణ్, యువతులు మొదటి సారి ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
సంగెం : మండలంలో 33 గ్రామపంచాయతీల్లో 44 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. కుంటపల్లి, కొత్తగూడెం గ్రామాల్లో 90 శాతంపైగా ఓటుహక్కును ఓటర్లు వినియోగించుకున్నారు. పల్లార్గూడలో 200వ బూత్లోని ఈవీఎం కొద్దిసేపు మొరాయించింది. అధికారులు సకాలంలో స్పందించి సరిచేశారు. వెంకటాపూర్లో వీవీ ప్యాడ్ రోల్లో ఎర్రర్ తలెత్తడంతో దానిని పునరుద్ధరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి సంగెం, కుంటపల్లి గ్రామాల్లోని పోలింగ్ బూత్లను పరిశీలించారు. సంగెం ఎస్సై ఎం భరత్ ఆద్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
శాయంపేట : మండలంలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా అంతటా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మండలంలో 42వ పోలింగ్ బూత్లను ఏర్పాటుచేశారు. గట్లకానిపర్తిలో మాక్ పోలింగ్ సమయంలో ఈవీఎం, వీవీప్యాట్ పనిచేయకపోవడంతో దాన్ని మార్చినట్లు అధికారులు తెలిపారు. పెద్దకోడెపాక, కొప్పుల, గట్లకానిపర్తి, గంగిరేణిగూడెం తదితర గ్రామాల్లో పోలింగ్ సిబ్బంది వల్ల ఆలస్యంగా పోలింగ్ జరిగినట్లు స్థానికులు తెలిపారు. మైలారం గ్రామంలో సమయం ముగిసే సరికి 300 మందికి పైగా ఓటర్లు ఉండడంతో గేట్లు వేసి ఎస్సై దేవేందర్, పోలీసు సిబ్బంది బందోబస్తుతో పోలింగ్ నిర్వహించారు. మొత్తంగా మండలంలో 85శాతంకుపైగా ఓటింగ్ జరిగింది. కాగా, మైలారంలోని పోలింగ్ కేంద్రంలో రెండు పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి సద్దుమణిగేలా చేశారు. అయితే మళ్ళీ మధ్యాహ్నం తోపులాట జరగడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. పరకాల ఏసీపీ కిశోర్కుమార్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. సీఐ దేవేందర్, ఎస్సై మల్లేశ్, 80 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.