మహబూబాబాద్, జనవరి 14 : తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ జాతీయాధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఏం చేసినా దేశంలో సంచలనమేనని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షే శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖమ్మం నుంచే రాష్ట్రం, దేశానికి దిశా నిర్దేశం చేసేందుకే జాతీయ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు తక్కువ సమయం ఉన్నందున ఎక్కువ జన సమీకరణ చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. గ్రామ జనాభా ప్రాతిపదికన తరలించాలని పిలుపునిచ్చారు. జిల్లా నుంచి సుమారు 50 వేల మందిని తరలించి మానుకోట బలాన్ని అందరికీ చూపించాలన్నారు. అతి త్వరలోనే మానుకోటకు మళ్లీ సీఎం కేసీఆర్ వస్తారని స్పష్టం చేశారు. సీఎం ఇచ్చిన వాగ్దానం ప్రకారం జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు కోసం ఐదు చోట్ల స్థలాలను పరిశీలించామని తెలిపారు. నివేదికను సీఎస్ శాంతికుమారికి త్వరలోనే అందజేస్తామన్నారు.
ప్రజలు, ప్రాంతాల అవసరాల మేరకు సీఎం కేసీఆర్ మానుకోటకు వరాలు కురిపించారని తెలిపారు. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువని, ఆ కోవకు చెందిన వారే బీజేపీ, కాంగ్రెస్ నాయకులని ఎద్దేవా చేశారు. చెరువుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయంటే అందుకు కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టే కారణమన్నారు. బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సమావేశం కరీంనగర్లో నిర్వహించారని, అక్కడి కంటే ఖమ్మం సభకు ఎక్కువ మందిని తరలించాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. కేసీఆర్ ఏ కార్యక్రమం చేసినా చారితాత్మకంగానే నిలుస్తుందని తెలిపారు. ఖమ్మం సభకు నలుగురు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, వామపక్ష నాయకులు హాజరవుతారని చెప్పారు. జన సమీకరణ ఇన్చార్జీలుగా మహబూబాబాద్ అర్బన్, మండలానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నెల్లికుదురు మండలానికి సాంబారి సమ్మారావు, కేసముద్రం మండలానికి నాగుర్ల వెంకటేశ్వర్లు, గూడూరు మండలానికి మాజీ ఎంపీ సీతారాం నాయక్ వ్యవహరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మర్రి రంగారావు, బీరవెళ్లి భరత్కుమార్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, రావుల శ్రీనాథ్రెడ్డి, నజీర్ అహ్మద్, యూత్ పట్టణాధ్యక్షుడు యాళ్ల మురళీధర్రెడ్డి, చిట్యాల జనార్దన్రెడ్డి, గద్దె రవి, గోగుల రాజు, మార్నేని రఘు, రవిచందర్రెడ్డి, ఓలం చంద్రమోహన్, పరిపాటి వెంకట్రెడ్డి, బాలునాయక్, రమేశ్, గంగాధర్, డౌలాగర్ శంకర్, ఖలీల్, యాదగిరిరెడ్డి, ఎర్రబెల్లి మాధవి, పర్కాల శ్రీనివాస్రెడ్డి, గోవింద్నాయక్ తదితరులు పాల్గొన్నారు.