తాడ్వాయి, ఫిబ్రవరి19 : జాతరను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందు కు పోలీస్శాఖ ప్రణాళికతో ముందుకు పోతున్నదని డీజీపీ రవిగుప్తా అన్నారు. మేడా రం జాతర పరిసరాల్లో సోమవారం ఎస్పీ శబరీష్ ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకున్న చర్యలు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు.
రోడ్డు ప్రమాదాలు జరుగకుండా, వాహనాలు రోడ్లపై చెడిపోతే తీసుకునే చర్యలను అడిగి తెలుసుకున్నారు. జాతర విజయవంతంలో పోలీసులదే క్రియాశీలక పాత్ర అని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడంతో పాటు భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. అనంతరం ఆయన తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించారు.