ఏటూరునాగారం, జనవరి 1 : నాస్తికుడు బైరి నరేశ్, అయ్యప్ప స్వాముల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతతకు దారితీసింది. ఈ క్రమంలోనే కారు ఢీకొట్టడంతో ఓ అయ్యప్ప భక్తుడు గాయపడగా మిగతా భక్తులంతా కోపోద్రిక్తులయ్యారు. ఈ ఘటన మండల కేంద్రంలో సోమవారం జరిగింది. మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బీఆర్ ఫంక్షన్ హాల్లో ప్రజా చైతన్య సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా నరేశ్ హాజరయ్యారు. నరేశ్ గతంలో అయ్యప్పస్వామి, భక్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నరేశ్ ఏటూరునాగారం వచ్చిన విషయం తెలుసుకున్న అయ్యప్పస్వాములు, భక్తులు అక్కడికి చేరుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. గతంలో అయ్యప్పస్వామిపై వ్యంగ్యంగా మాట్లాడడం, దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావంటూ నిలదీసి వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అయ్యప్పస్వాములు, బైరి నరేశ్ మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.
గతంలో తనపై ఇదే విషయమై కేసులు నమోదయ్యాయని, తాను అన్న మాటలను వెనక్కి తీసుకున్నానని, తనను క్షమించాలని అయ్యప్ప భక్తులను కోరారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లే క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఫంక్షన్హాల్ నుంచి బయటకు వచ్చి తన కారులో నరేశ్ వెళ్తుండగా పోగు నర్సింగారావు అనే భక్తుడిని ఢీకొట్టగా కాలికి గాయమైంది. అయ్యప్ప భక్తులు అడ్డుకుంటుండగా ఆపకుండా వెళ్లడంతో కోపోద్రిక్తులైన అయ్య ప్ప భక్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ బైరి నరేష్ను అరెస్టు చేయాలని నినాదాలు చేస్తూ కొందరు వెంబడించారు. క్రమంలో బైరి నరేశ్ కమలాపురం వైపు వెళ్తుండగా అటువైపు నుంచి వస్తున్న వాహనాన్ని తప్పించే హౌకమంలో కారు అదుపు త ప్పి రోడ్డు దిగి చెట్లల్లకు వెళ్లింది. కారులోని బెలూన్లు తో నరేశ్తోపాటు అందులో ఉన్న వారికి ప్రమాదం తప్పింది. కారులో నుంచి బయటపడిన నరేశ్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఎస్సై ఘట నా స్థలానికి చేరుకుని కారును పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా, గాయపడిన నర్సింగారావును స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం వరంగల్ తరలించారు.