నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 26 : ‘అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్తోనే ఆత్మగౌరవం పెరుగుతుందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. తల్లీబిడ్డల మరణాల రేటును గణనీయంగా తగ్గించి వారిలో కొండంత ధీమా కల్పిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాలు ఆందోళకరంగా ఉన్న తరుణంలో మంచి పాలనాదక్షుడిగా రాణిస్తున్న కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి ఎంతో అవసరం’ అని అంగన్వాడీ కార్మికులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఉంటే రాష్ట్రంలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్.. తదితర పథకాలన్నీ దేశవ్యాప్తంగా ప్రజలకు అందుతాయని చెబుతున్నారు. అన్ని రాష్ర్టాల ప్రజల అవసరాలను బట్టి ఆదుకుంటారని, కేసీఆర్తోనే దేశ భవిష్యత్ మారుతుందని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో అంగన్వాడీలకు సమాజంలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు. దేశంలో కంటే అత్యధిక వేతనాలు పెంచి ఆదుకున్నారు. మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పోషకాహారం అందిస్తున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేసి, వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మహిళలపై దారుణాలు జరుగుతున్నా పట్టించుకునేవారే లేరు. దేశంలోని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నా, ఆర్థిక స్వావలంబన సాధించాలన్నా అది ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్య’మని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశంలోని అన్ని వర్గాలకు లాభం జరుగుతుందని ఆకాంక్షిస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో అమలైతే అన్ని వర్గాల ప్రజలకు మంచి రోజులు వస్తాయని అభిప్రాయపడ్డారు.
ములుగు రూరల్, సెప్టెంబర్ 26: ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్. ఆయన దేశ రాజకీ యాల్లోకి వెళ్ల్లడం మంచిదే. ఆయన రాష్ట్రంలో అంగన్వాడీలను బలోపేతం చేసి, టీచర్, ఆయాల సేవలను గుర్తించారు. కోడిగుడ్లు, పాలు, పౌష్టికాహారం రోజు వారీగా లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఇవి పుట్టబోయే బిడ్డకు, తల్లి, పుట్టిన బిడ్డలకు ఎంతో ఆరోగ్యకరం. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లి ప్రధాని అయినట్లయితే దేశ వ్యాప్తంగా గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందుతుంది. ఆయనకు మా సపోర్టు పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే మా కష్టాన్ని గుర్తించింది కేసీఆరే.
– జన్నె శోభారాణి, రామయ్యపల్లి, ములుగు
సంక్షేమ పాలన దేశవ్యాప్తం కావాలి
వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 26: కొత్త రాష్ట్రంగా ఏర్పడి తక్కువ సమయంలోనే అభివృద్ధిలో దూసు కుపోతోంది. అది కేసీఆర్తో మాత్రమే సాధ్యమైంది. ప్రజా సంక్షేమంలో రాష్ట్రం ముందుందని అన్ని పార్టీల నాయకులు అంగీకరిస్తున్నారు. విద్య, వైద్యరంగంలో చాలా మార్పులు వచ్చాయి. దేశంలో ఎక్క డాలేని విధంగా సంక్షేమ హాస్టల్స్లో విద్యార్థులకు సన్న బియ్యంతో పోషకాహారం అందిస్తున్నారు. అదేవిధంగా మహిళా సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్త్తోంది. కల్యాణలక్ష్మి, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్.. లాంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు జరగాలంటే కేసీఆర్ లాంటి నాయకులు అవ సరం. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే మహిళా లోకం ఆదరించడానికి సిద్ధంగా ఉంది.
– సునీత, చింతల్, వరంగల్
దేశ ప్రగతికి బాటలు
మహదేవపూర్, సెప్టెంబర్ 26: కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశ ప్రగతికి బాటలు పడుతాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. స్త్రీ, శిశు సంక్షేమానికి, మహిళా వికాసానికి పెద్దపేట వేస్తున్నారు. షీటీమ్స్ నెలకొల్పి మహిళల భద్రతకు భరోసా కల్పిస్తున్నారు. అంగన్వాడీలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా ప్రతి రోజూ పౌష్టికాహారం, కిశోర బాలికలకు న్యూట్రిషన్ కిట్స్ అందిస్తున్నారు. అంగన్వాడీల వేతనాలను పెంచి నూతన వెలుగులు నింపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో అమలైతే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతది. దేశంలో అన్ని వర్గా ల వారు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం.
– బొడవర్తి సత్యవాణి, మహదేవపూర్
అన్ని రాష్ట్రాల అంగన్వాడీ సెంటర్లు బలోపేతం
మరిపెడ, సెప్టెంబర్ 26: కేసీఆర్ పాలనలో అంగన్వాడీ సెంటర్లు బలోపేతమై మాతాశిశు సంరక్షణతో పాటు ప్రాథమిక విద్యాబోధన కేంద్రాలుగా వర్ధిల్లుతున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తుండడంతో మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. కేసీఆర్ వచ్చాక అంగన్వాడీ టీచర్లకు రూ.13,500, మినీ అంగన్వాడీ ఆయాలకు రూ.7వేలు ఇస్తున్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ర్టాలతో పోలిస్తే ఇక్కడే వేతనాలు ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తే దేశవ్యాప్తంగా ఇటువంటి పథకాలు అమలుచేయడం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రయోజనం కలుగనుంది.
– శిరీష, సీడీపీఓ, మరిపెడ
విప్లవాత్మక మార్పులు
ఖానాపురం, సెప్టెంబర్ 26: అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాలు పెంచి వారి కుటుంబాల్లో సంతోషం నింపిన ఘనత కేసీఆర్దే. ఆయన ముందుచూపు న్న నాయకుడు. ఎ నిమిదేళ్ల కాలంలోనే రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికి రోల్మోడల్గా నిలిపారు. అలాంటి నాయకుడి సేవలు దేశానికి ఎంతో అవసరం. కేసీఆర్తో పేదరికం నిర్మూలన సాధ్యం. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన జరుగు తుంది. ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు మంచి వేతనాలు అందుతాయి. వ్యవసాయ, ఐటీ రంగంలో విప్లవాత్మక మా ర్పులు వస్తాయి. వనరుల వినియోగించుకుని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారు. ప్ర పంచ దేశాల చూపు భారత్ వైపు నిలిచేలా పాలన ఉంటుంది.
– ఎర్ర జ్వలితారెడ్డి,
అయోధ్యనగర్, ఖానాపురం
మహిళా సాధికారతకు పెద్దపీట
జఫర్గఢ్, సెప్టెంబర్ 26: మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్. రాష్ట్రంలో మ హిళల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మహిళలపై జరుగుతున్న దారుణాలు అనీఇన్నీ కావు. దేశంలోని మహిళలు అన్ని రంగాల్లో రాణించాల న్నా, ఆర్థిక స్వావలంబన సాధించాలన్నా కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నేతకే సాధ్యం. రాష్ట్రంలో అమలవు తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్.. తదితర పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలు కావాలంటే ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే.
– కడారి శైలజ, తిడుగు, జఫర్గఢ్
అంగన్వాడీల ఆత్మబంధువు
బచ్చన్నపేట, సెప్టెంబర్ 26 : అంగన్వాడీల ఆత్మబంధువు కేసీఆర్. రాష్ట్రం లో ఆయన అధికారంలోకి వచ్చాకే సమాజంలో గుర్తింపు, గౌరవం దక్కింది. మూడు సార్లు వేతనాలు పెంచి మా కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచిండు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలను గుర్తించారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యలక్ష్మి పథకం పెట్టిండు. కరంటు సౌకర్యం లేని సెంటర్లకు మీటర్లు ఇప్పించిండు. దీంతో టీచర్లు, ఆయాలు అంకితభావంతో పనిచేస్తున్నం. మాకు అన్ని విధాలా అండగా నిలిచారు. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్లి రాష్ర్టానికి మరింత పేరు తేవాలని ఆశిస్తున్నం. – గణపురం కవిత, బచ్చన్నపేట
ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు
పరకాల, సెప్టెంబర్ 26: రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ల ఆత్మగౌరవాన్ని పెంచిందే కేసీఆర్ సారే. కార్యకర్తలను టీచర్లుగా గుర్తించి సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. వేతనాలు పెంచి ఎంతోమంది అంగన్వాడీ కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. దేశంలో తెలంగాణ టీచర్లకు, ఆయాలకే అత్యధిక వేతనాలు అందుతున్నాయి. కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలతో పాటు తల్లీబిడ్డల మరణాల రేటు గణనీయంగా తగ్గింది. దేశంలోని అన్ని రాష్ర్టాల అంగన్వాడీలకు లబ్ధి చేకూరాలంటే అది కేసీఆర్తోనే సాధ్యం. ప్రస్తుత సమయంలో ఆయన దేశ రాజకీ యాల్లోకి వెళ్లాల్సిందే.
– కందగట్ల రమ, పరకాల