గీసుగొండ, డిసెంబర్ 30 : రాష్ట్రంలోని గ్రామాలన్నీ సంపూర్ణ అభివృద్ధి సాధించాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని బొడ్డుచింతలపల్లి, కోనాయిమాకుల, మనుగొండ, ఎలుకుర్తి, అనంతారం, సూర్యతండా, దస్రుతండా, హర్జ్యతండా, ఊకల్ గ్రామాల్లో రూ. కోటీ 80 లక్షలతో గ్రామ పంచాయతీ భవనాలు, ఊకల్ గ్రామంలో రూ. 20 లక్షలతో మహిళా సాధన అంజనేయ గ్రామైక్య సంఘం భవనం నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఊకల్లో ఆయన మాట్లాడుతూ.. పరకాల నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక నిధులను ఇచ్చారన్నారు. 24 గంటల కరంటుతో రైతుల కష్ర్టాలను తీర్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు.
కులమతాలకు అతీతంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. మార్చిలోపు భవనాల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నదని ఆరోపించారు. తెలంగాణ పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బులను కేంద్రం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలకు కేటాయిస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. అభివృద్ధి పనులపై కేంద్రం 18 శాతం జీఎస్టీని వసూలు చేయడం దారుణమన్నారు. అర్హులందరికీ త్వరలోనే డబుల్ బెడ్రూం ఇండ్లను ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ బడా వ్యాపారులకు రూ.10లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసింది వాస్తవమని, గ్రామాల్లో బీజేపీ నాయకులను ప్రజలు ప్రశ్నించాలన్నారు.
ఊకల్కు 20 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేస్త్తామన్నారు. రాంనగర్లో రూ. 10లక్షలతో సీసీ రోడ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. టెక్స్టైల్ పార్కులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఎంపీపీ భీమగాని సౌజన్య, సర్పంచ్లు కేదాసి అనిల్, డోలి రాధాబాయి, నమిండ్ల రమ, పూండ్రు జైపాల్రెడ్డి, మక్కెన అశ్విని, కేలోత్ సరోజన, వాంకుడోత్ రజిత, అంగోత్ కవిత, మొగసాని నాగమణి, బోడకుంట్ల ప్రకాశ్, మల్లారెడ్డి, నాగేశ్వర్రావు, బాబు, ఎంపీటీసీలు వాంకుడోత్ గోపాల్, కంబాల రజిత, బేతినేని వీరరావు, డీఈ రాజేశ్వర్, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఏపీఎం సురేశ్కుమార్, కార్పొరేటర్ మనోహర్, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమేశ్, సొసైటీ చైర్మన్లు వీరస్వామి, మోహన్రెడ్డి, రడం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ..
గీసుగొండ : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ కార్యదర్శి మద్దెల నర్సింగరావు సొంత ఖర్చులతో ముద్రించిన బీఆర్ఎస్-2023వ సంవత్సర క్యాలెండర్ను శుక్రవారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఊకల్ గ్రామంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకులపల్లి మనోహర్, డీసీసీబీ డైరెక్టర్ రమేశ్, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మండలాధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి, నాయకులు రాజు, సతీశ్, రేణుక, ఉజ్వల్, మధుకర్, లవ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.