పర్వతగిరి, అక్టోబర్ 18: ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలను ప్రజలు తిప్పి కొట్టేలా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలను చైతన్యం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని తన స్వగృహంలో రాయపర్తి మండలం మైలారం, పెర్కవేడు, కొత్తూరు, బంధన్పల్లి, గట్టికల్, పానీష్తండా, గణేశ్కుంట తండా, కొండూరు, తిర్మలాయపల్లి, గన్నారం గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో బుధవారం చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ శ్రేణులు, పార్టీ ముఖ్య నాయకులతో వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను కార్యకర్తలు మండల ప్రజలకు విడమరిచి చెబుతూ చైతన్యం చేయాలని సూచించారు. మండలంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్య నేతలంతా సమన్వయంతో పని చేయాల్సిందిగా కోరారు.
ప్రజా ప్రజాసమస్యలను ఏనాడూపట్టించుకోని ప్రతిపక్షాలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు. పార్టీ విజయం కోసం సైనికుల్లా కార్యకర్తలు, నాయకులందరికీ ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ మండల ఎన్నికల ఇన్చార్జి గుడిపూడి గోపాల్రావు, పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహ్మానాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్ల సుధీర్రెడ్డి, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, పూస మధు, చిన్నాల తారాశ్రీ రాజబాబు, బండి అనూషారాజబాబు, ఆకుల సమ్మయ్య, కందికట్ల స్వామి, కందికట్ల రాధమ్మ రాజయ్య, దొమ్మాటి సుభాష్, భూక్యా దీప్లానాయక్, అడ్డాల నాగేశ్వర్రావు, రమేశ్, చెవ్వ సంపత్, కోదాటి దయాకర్రావు, గుగులోత్ జాజునాయక్, గుడిపూడి సత్యనారాయణరావు, ఎనగందుల యాకనారాయణ, తేరాల యాకయ్య, చిన్నాల వనజాలక్ష్మీనారాయణ, శ్రీనివాస్, చెవ్వ కాశీనాథం, భూక్యా భద్రూనాయక్, మచ్చ సత్యం, కర్ర సరిత రవీందర్రెడ్డి, చిర్ర ఉపేంద్ర, దేశబోయిన ఉపేందర్ పాల్గొన్నారు.