నర్సంపేట, జనవరి 6: అద్దె ఇంట్లో చనిపోతే శవాన్ని ఇంటి ఆవరణలో వేసు కోవడానికి కూడా యజమానులు ఒప్పుకోని పరిస్థితి. కరోనా కష్టకాలంలోనూ కరో నా వచ్చిందంటే ఆ కుటుంబాన్ని ఇంట్లో నుంచి ఖాళీ చేయించారు. ఇంటికి కుటుం బ సభ్యులను కూడా రానీయలేదు. ఇటీవల అద్దె ఇంట్లో ఉంటున్న ఓ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోతే ఆ కుటుంబం మొత్తం కూరగాయల మార్కెట్లోని షెడ్డులో ఉండి కర్మకాండలు నిర్వహించింది. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి అధిగమించేందుకు నర్సంపేట మున్సి పాలిటీ ఆఖరి మజిలీ ఆవాసం పేరుతో రెండు కుటుంబాలకు సరిపోయేలా భవనం నిర్మించి, అందుబాటులోకి తీసుకువచ్చింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సు దర్శన్రెడ్డికి ఆలోచన రావడంతో వెంటనే ఒక భవనం నిర్మించాలని మున్సిపాలిటీని ఆదేశించారు. దీంతో పాలక వర్గం కూడా అందుకు అనుగుణంగా తీర్మానం చేసి, నిధులు కూడా మంజూరు చేసి, భవనాన్ని టెండర్ పిలిచి పూర్తి చేయించింది. పాలక వర్గం నిర్ణయంతో ఇళ్లులేని ఎంతో మందికి ఇది ఉపయోగపడేలా ఉంది.
చనిపోతే రోడ్డు మీదే శవం.. కర్మకాండలకు దూరం..
అద్దె ఇంట్లో ఎవరైనా చనిపోతే శవం కూడా ఇంట్లో ఉండనీయని పరిస్థితి. శవాన్ని శ్మశానవాటికలోనే వేసి, బంధువులు వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వ హించుకునే వారు. అయితే కర్మకాండలు పదకొండు రోజులు కూడా ఆ కుటుం బాన్ని ఇంటికి రానివ్వడానికి నిరాకరించిన సందర్భాల్లో వారు ఎక్కడో ఒక చోట చెట్లకింద, తలదాచుకుని కర్మకాండలు నిర్వహించే వారు. ఇలాంటి పరిస్థితిలో చాలా మంది రోడ్డు మీద పడుతున్నారు. కొన్ని నెలల కిందట తల్లి మరణంలో ఓ కుటుంబం అనాథగా మారింది. 11వ వార్డులో కాగితపు భాగ్యలక్ష్మి చనిపోయింది. ఆమెకు ముగ్గురు పిల్లలు, కుమారుడు కాలు విరిగిమంచాన పడ్డాడు. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం కర్మకాండలను కూరగాయల మార్కెట్లోనే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నివసించడానికి సొంత గృహం లేని పక్షంలో రైతు బజార్లోనే పదకొండు రోజులు ఆకుటుంబం ఉంది. ఇలాంటి సంఘటనలు ఎంతో మంది ఎదుర్కొంటున్నారు.
పెరుగుతున్న పట్టణ జనాభా..
నర్సంపేట పట్టణంలో 55 వేల మంది జీవనం కొనసాగిస్తున్నారు. 12 వేల గృహాలు ఉన్నాయి. వీటిలో మున్సిపాలిటీ నిర్వహించిన సర్వేలో 10,500 మందికి గృహాలు లేవు. వీరందరూ అద్దె ఇంట్లోనే కాలం గడుపుతున్నారు. నర్సంపేట పట్టణం గ్రామీణ ప్రాంతాలకు సమీపాన ఉంది. వ్యాపార, విద్యా పరంగా చాలా అభివృద్ధి చెందింది. నిరుపేదలు, చేతివృత్తుల వారు. చిరు వ్యాపారులు తమ బతుకు దెరువు కోసం వచ్చి నర్సంపేటలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్న వారు ఉన్నారు. ఇళ్లు లేని వారి కోసం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రత్యేకంగా ఒక ఇంటిని నిర్మించి అందుబాటులోకి తీసుకుని వస్తే మంచిదని భావించారు. ప్రస్తుతం మాదన్నపేట రోడ్డులో ఉన్న శ్మశాన వాటికలో ఒక భవనం రూ.20 లక్షల వ్యయంతో 14వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేశారు. దీనిలో రెండు కుటుంబాలకు చెందిన వారు 11 రోజుల పాటు ఉండి కర్మకండలు నిర్వహించే అవకాశం ఉంది.
ఎమ్మెల్యే పెద్ది ఆలోచనతోనే నిర్మించాం
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆలోచనతోనే గృహాలు లేని వారి కోసం తాత్కాలికంగా కర్మకాండలు చేసుకునే విధంగా శ్మశాన వాటిలో భవనాన్ని నిర్మించాం. ఎమ్మెల్యే చెప్పిన వెంటనే మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి, నిధులు మంజూరు చేయించాం. నిర్మా ణం కూడా పూర్తి చేశాం. త్వరలోనే ఈ భవనాన్ని అందుబాటులోకి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తాం.
-మున్సిపాలిటీ చైర్పర్సన్ , గుంటి రజనీకిషన్
అభినందనీయం
గృహాలు లేని నిరుపేదలు ఎంతో ఇబ్బందులు పడుతు న్నారు. ఎండాకాలం అయితే చెట్టకిందే ఆ కుటుం బాలు ఉం డి కర్మకాండలు పూర్తి చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆఖరి మజిలీ ఆవాసాన్ని నిర్మించడానికి ముందుకు రావడం అభినందనీయం.
-జీజుల సాగర్, నర్సంపేట
మంచి ఆలోచన..
అద్దె ఇంట్లో చనిపోతే శవాన్ని ఇండ్లలో వేయనీయరు. దీంతో శ్మశానంలోనే ఆ కుటుంబం ఉండి కర్మకాండలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి వారి కోసం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సు దర్శన్రెడ్డి ఆలోచనలు చేసి, ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించారు. దీనిని మున్సిపాలిటీ పరిధిలో అందుబాటులోకి రానుండడం ఆనందంగా ఉంది.
-మండల శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్,నర్సంపేట