జమ్మికుంట, అక్టోబర్ 25 : బీఆర్ఎస్కు కార్యకర్తలే పట్టుగొమ్మలని, వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్తా ఒక సైనికుడిలా పనిచేయాలని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పిలుపునిచ్చారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, హుజూరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరేయాలని కోరారు. బుధవారం ఆయన జమ్మికుంట పట్టణంలో పర్యటించారు. మున్సిపల్ పరిధిలోని 11, 12, 16, 22, 30వ వార్డుల్లోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో మూడోసారి సీఎంగా కేసీఆర్ ఖాయమని, ఇక్కడ కూడా బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించు కుందామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, అన్ని వర్గాలకు సముచిత స్థానం దక్కుతున్నదని తెలిపారు. స్వరాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలుకావాలన్నా.. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలన్నా..
బీఆర్ఎస్నే గెలిపించుకోవాల్సినవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఇంటికీ సంక్షే మ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా దేశంలో ఎక్కడాలేదన్నారు. రైతు బీమా, రైతు బంధు, పింఛన్లు, ధాన్యం కొనుగోళ్లు, కేసీఆర్ కిట్లు, గురుకులాలు, కార్పొరేట్కు దీటుగా వైద్యం, ఇలా చెప్పుకొం టూ పోతే.. ఎన్నో పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని పేర్కొన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ ఒక్కరేనన్నారు. గత ఉప ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన ఈటల రాజేందర్ తట్టెడు మైట్టెనా పోసిం డా.. చెప్పాలన్నారు. పనిచేయని నాయకుడెవరో, ప్రజల మధ్య తిరుగుతూ సమస్యలు పరిష్కరిస్తున్న నాయకుడెవరో ప్రజలే గుర్తించాలని కోరారు. తనను ఎన్నికల్లో ఆదరిస్తే అసెంబ్లీలో అడుగు పెడతానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు ఇస్తానని మాటిచ్చారని, రాష్ట్రంలోనే నంబర్గా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. అభివృద్ధి చేయకుంటే మరోసారి ఓటు అడగనన్నారు. సాదుకుంటరో.. సంపుకొంటరో.. ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా సమావేశాల్లో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న-కోటి, కౌన్సిలర్లు బిట్ల కళావతి, కుతాడి రాజయ్య, గుల్లి మొగిలి, మద్ది లావణ్య, నాయకుడు మొలుగు దిలీప్, ఆయా వార్డు అధ్యక్షులు, సభ్యులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కమలాపూర్: మండలంలోని కన్నూరు గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో హుజూరాబాద్లో బుధవారం చేరారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వెల్లడించారు. నూనె మ ధు, నాగరాజు, పిట్టల నరేశ్, బిల్లరాజు, తౌటం శ్రీరాం, రాకేశ్, వినయ్, చందర్తో పాటు 50 మంది బీజేపీ పార్టీకి చెందిన యూత్ సభ్యులు బీఆర్ఎస్లో చేరడంతో కౌశిక్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుల్లూరి రాంచందర్రావు, డైరెక్టర్ సత్యనారాయణరావు ఉన్నారు.