నెక్కొండ, అక్టోబర్ 21: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపిన బీఆర్ఎస్కు ప్రజలు మరోసారి పట్టం కట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. పెద్దకోర్పోలు గ్రామం నుంచి 40 కుటుంబాలు, బంజరుపల్లి నుంచి 15 కుటుంబాలు, అజ్మీరామంగ్యాతండా నుంచి 18 కుటుంబాలు, తోపనపల్లి నుంచి 17 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మండలకేంద్రంలో ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడంతో సాగునీరు పుష్కలంగా లభిస్తున్నదన్నారు. వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో రైతులు ఏటా మూడు పంటలు పండిస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ అథోగతి పాలు అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు గోసపడ్డారని, సాగు, తాగునీరు, కరెంట్ కష్టాలను ఓసారి గుర్తుచేసుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. నర్సంపేటను అన్ని రంగాల్లో ముందువరుసలో ఉంచానన్నారు. తనను నిండుమనస్సుతో ఆశీర్వదించి అధిక మెజార్టీని కట్టబెట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, నెక్కొండ, రెడ్లవాడ సొసైటీ చైర్మన్లు మారం రాము, జలగం సంపత్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, జడ్పీటీసీ లావుడ్యా సరోజా హరికిషన్, సీనియర్ నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, సూరం రాజిరెడ్డి, కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి ,మాదాసు రవి పాల్గొన్నారు. అనంతరం రెడ్లవాడ మాజీ సర్పంచ్ అన్నమనేని సంతోష్ జన్మదిన వేడుకల్లో పెద్ది పాల్గొని కేక్ కట్ చేశారు.
చెన్నారావుపేట/దుగ్గొండి/నల్లబెల్లి: బీఆర్ఎస్ సర్కారుతోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన సాధ్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఖాదర్పేట నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 కుటుంబాలు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్ చేరాయి. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, సీనియర్ మండల నాయకుడు బాల్కె వెంకన్న, చెన్నారావుపేట సర్పంచ్ కుండె మల్లయ్య, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు కంది కృష్ణచైతన్య, ఎంపీటీసీ ధరావత్ శ్రీను, సర్పంచ్ అనుముల కుమారస్వామి పాల్గొన్నారు. అలాగే, మండల మహిళా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. దుగ్గొండి మండలం బంధంపల్లికి చెందిన 25 కుటుంబాలు వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. పార్టీలో చేరిన వారిలో వడ్డెపల్లి కృష్ణ, కొత్తూరి లక్ష్మి, ఎక్కటి రాజిరెడ్డి, హుస్సేన్పల్లి సుదాకర్, కొత్తూరి శ్రీనివాస్ కోదాటి సమ్మారావు, కోదాటి రాంబాబు, కొత్తూరి ప్రబాకర్ ఉన్నారు. అంతేకాకుండా నల్లబెల్లి మండలంలోని మూడుచెక్కలపల్లెకి చెందిన కాంగ్రెస్, బీజేపీ నుంచి 50 కుటుంబాలు ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ పూల్సింగ్, ఎంపీటీసీ దేవూనాయక్, పోలాటి శ్రీనివాస్, షేక్ మసూద్ ఉన్నారు.