వరంగల్, ఏప్రిల్ 26(నమస్తేతెలంగాణ)/మహబూబాబాద్ రూరల్: వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో పది మంది నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. మొత్తం 58లో పది మంది అభ్యర్థుల నామినేషన్లు రిజెక్ట్ అయినట్లు ప్రకటించారు. వీరిలో బీజేపీ నుంచి కొండేటి శ్రీధర్, బీఆర్ఎస్ నుంచి అందె యాకయ్య, స్వతంత్ర అభ్యర్థులు బాబుమోహన్, సురేశ్, శంకర్, కావ్యశ్రీ, సంపత్, కమలాకర్, ప్రభాకర్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి లక్ష్మీనారాయణ ఉన్నారు. మిగతా 48 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం తెలిపినట్లు రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య తెలిపారు. ఇందులో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు మారెపల్లి సుధీర్కుమార్, అరూరి రమేశ్, కడియం కావ్య ఉన్నారు. మహబూబాబాద్లో ఐదుగురు అభ్యర్థుల నామి నేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 30 మందిలో ఐదుగురి నామినేషన్లు రిజెక్ట్ కాగా 25 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం తెలిపినట్లు ఆర్వో అద్వైత్కుమార్ సింగ్ తెలిపారు. వీరిలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు మాలోత్ కవిత, సీతారాంనాయక్, బలరాంనాయక్ ఉన్నారు.