దేవరుప్పుల, మే 11 : కరోనా సమయంలో గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు, పంచాయతీ ఉద్యోగులు, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగవాడీ టీచర్లు అందించిన సేవలు మరువలేనివని ట్రైనీ ఎస్సై నల్లగట్ల కృష్ణవేణి అన్నారు. మంగళవారం మండలంలోని కడవెండిలో సర్పంచ్ పోతిరెడ్డి బెత్లినారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఫ్రంట్లైన్ వారియర్స్ను సత్కరించారు. కృష్ణవేణి మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో తామున్నామంటూ ప్రజలకు సేవలు చేసిన వీరు ఆదర్శనీయులన్నారు. కడవెండికి చెందిన పారిశుధ్య కార్మికుడు పడమటింటి రామచంద్రుడు సంవత్సర కాలంగా కరోనా బాధితులకు సేవలందిస్తూ ప్రజల మనసులు చూరగొనడం గొప్పవిషయమన్నారు. మరోవైపు ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు కరోనా ఫ్రంట్లైన్ వారియర్లుగా పనిచేస్తున్నారని, వైరస్ అంతమయ్యే వరకూ పోరాడాలని ఆమె కోరారు. అనంతరం లోడి సంస్థ అందించిన మాస్కు లు, శానిటైజర్లు, కోడిగుడ్లు, పండ్ల ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దుబ్బాక కవిత, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నక్క రమేశ్, జీపీ కార్యదర్శి మధుకర్, కరోనా కమిటీ సభ్యులు వీరాచారి, రామచొక్కం, సుధాకర్, శ్రీను, భిక్షపతి, లీనారెడ్డి, రత్నాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాస్క్ ధరించి భౌతికదూరం పాటించాలి
బచ్చన్నపేట : కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని డాన్ మినిస్ట్రీస్ హైదరాబాద్ సంస్థ వ్యవస్థాపకుడు చిలుముల పీటర్ అన్నారు. మంగళవారం మండలంలోని వీఎస్ఆర్ నగర్ సర్పంచ్ కోనేటి స్వామి ఆధ్వర్యంలో పాస్టర్ జంపాల పరశురాములుతో కలిసి ఉపాధి హామీ కూలీలు, స్థానికులకు మా స్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీటర్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉం డాలని కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేశ్, వార్డు సభ్యులు కృష్ణవేణి, రజిత, అనసూర్య, రాజు పాల్గొన్నారు.