అదేంటి.. పూరీ జగన్నాథ్ పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎందుకు ఫైర్ అవుతున్నారు అనుకుంటున్నారా..? ఎందుకంటే తమ హీరో సినిమా లైగర్పై ఇప్పటివరకు అప్డేట్స్ లేవని, కనీసం పోస్టర్ కూడా విడుదల చేయడం లేదని వాళ్లు మండిపడుతున్నారు.
ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో లైగర్ పేరుతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. హిందీలో ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తుండటం గమనార్హం. అక్కడ కూడా భారీగానే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పైగా ఈ సినిమా కోసం రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వరస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండపై ఇంత బడ్జెట్ పెట్టడం ఎంతవరకు వర్కవుట్ అవుతుందనే వాదనలు కూడా వస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే తన స్టైల్కు భిన్నంగా ఈ సినిమాను చాలా నెమ్మదిగా తెరకెక్కిస్తున్నాడు. ఏ సినిమా అయినా కూడా ఆరు నెలల్లో పూర్తి చేసే పూరీ.. విజయ్ దేవరకొండ సినిమా కోసం మాత్రం ఏడాదిన్నర టైం తీసుకున్నాడు. మధ్యలో కరోనా బ్రేక్ పక్కన పెట్టినా కూడా విజయ్ సినిమా కోసం ఎక్కువ సమయమే తీసుకున్నాడు.
బహుశా ఆయన కెరీర్లో ఇంత టైం తీసుకొని చేస్తున్న సినిమా ఇదే కావచ్చు. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్ కూడా వేగంగా జరగడం లేదు. ఫస్ట్ లుక్ తప్పిస్తే ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి మరేం అప్డేట్ రాలేదు. దాంతో విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమా ఎలాగూ లేట్ అవుతుంది కదా కనీసం పోస్టర్స్ అయినా విడుదల చేయండి పూరీ జగన్నాథ్ గారూ అంటూ వేడుకుంటున్నారు. కంటెంట్ కూడా బలంగా ఉండటంతో సినిమా ఆలస్యం అవుతూనే ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 9న లైగర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కరోనా ఉండటంతో అనుకున్న టైంకు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది అర్థం కావడం లేదు. ఏదేమైనా కూడా లైగర్ అప్ డేట్స్ విషయంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
తమన్ పెద్ద మనసు.. మరణించిన కీ బోర్డు ప్లేయర్ ఫ్యామిలీకి ఆర్థిక సాయం
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
తారక్ ప్రాజెక్టులన్నీ ఆలస్యం..!
క్వారంటైన్లో ఉన్న నాన్న కోసం స్పెషల్ దోశె వేసిన అర్హ
మహేష్ బాబు సినిమాతో జాన్వీ ఎంట్రీ పక్కానా..!