భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది బాలీవుడ్ భామ కియారా అద్వాని. ఈ సినిమా విజయం తర్వాత టాలీవుడ్లో వరుస అవకాశాలు వచ్చాయి. రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ ఫ్లాప్తో మళ్లీ బాలీవుడ్కు వెళ్లిన కియారా అక్కడ బిజీ అయిపోయింది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది. దాంతో పాటు వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు వస్తుండడంతో తెలుగు సినిమాల వైపు చూడటం మానేసింది కియార అద్వానీ. ఆ మధ్య ఒకటి రెండు అవకాశాలు వచ్చినా కూడా పట్టించుకోలేదు. అయితే ఇన్నాళ్ల తర్వాత కియారా మళ్లీ తెలుగు సినిమా చేయబోతుందని ప్రచారం జరుగుతుంది.
అది కూడా తనను టాలీవుడ్ కు పరిచయం చేసిన కొరటాల శివ కోసం మళ్లీ ఇక్కడికి వస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న కొరటాల.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేయబోతున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ ఆఫర్ కావడంతో ఈ కియారా ఈ సినిమా కాదనలేకపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. యువసుధా బ్యానర్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ సినిమా రాబోతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
తనకు ఎన్టీఆర్ ఆదర్శం అంటున్న యంగ్ హీరో
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!
కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే