తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అందరు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరి రాష్ట్రమంతా తిరిగినా కనీసం ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు. అయితే అనుభవం లేకపోవడం వల్లే కమల్ హాసన్ ఇంత దారుణంగా ఓడిపోయారంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ఓటమిపై ఆయన కూతురు శృతి హాసన్ కూడా స్పందించింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలా మంది అన్ని పార్టీల గురించి చర్చిస్తున్నారన్న శృతిహాసన్.. ముఖ్యంగా తన తండ్రి ఓటమి గురించి మాట్లాడుతున్నారని తెలిపింది. గెలిచినా.. ఓడినా ఎప్పుడూ తన తండ్రిని చూసి గర్వపడుతూనే ఉంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీరు ఎప్పుడూ మమ్మల్ని గర్వపడేలాగానే చేశారు. Always So Proud of My Appa అంటూ కమల్ హాసన్ పార్టీ గుర్తు టార్చిలైట్ చేతిలో ఉన్న ఫోటో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. కాగా, అసలు తప్పు ఎక్కడ జరిగింది అంటూ విశ్లేషణ చేసుకునే పనిలో పడ్డారు కమల్ హాసన్. ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే అని ఎన్నికల ఫలితాల అనంతరం కమల్ తెలిపిన సంగతి తెలిసిందే.
ఇక శృతి హాసన్ కెరీర్ విషయానికి వస్తే 2021 ఆమెకు బాగా కలిసొచ్చింది. సంక్రాంతికి రవితేజ హీరోగా వచ్చిన క్రాక్.. మొన్న పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలు బాగానే ఆడాయి. దాంతో మళ్లీ బిజీ అయిపోతుంది శృతి హాసన్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమాలో నటిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మరో రీమేక్ పై కన్నేసిన వెంకటేశ్..?
కలలు రియాలిటీ కన్నా బాగున్నపుడు..రాశీఖన్నా స్టిల్ వైరల్
సౌందర్య శర్మ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్
కరోనాతో కన్నుమూసిన ప్రముఖ హీరోయిన్ సోదరుడు..!
పవన్ కళ్యాణ్ హెల్త్పై తాజా అప్డేట్..!