అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దఢఖ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్ కాకపోయిన అమ్మడికి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్తో చాలా బిజీగా ఉంది. అయితే జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి కొన్నాళ్లుగా ఆసక్తికర ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తుంది, ఆ సినిమాతో ఇస్తుందని అనడమే తప్ప అది నిజం కావడం లేదు.
తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మంచి స్క్రిప్ట్ దొరికితే జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ పక్కాగా ఉంటుందని గతంలో బోనీ కపూర్ పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ చిత్రం జాన్వీ కెరియర్కు మంచిగా ఉపయోగపడుతుందని భావిస్తున్న బోని తన కూతురిని మహేష్ చిత్రంతో టాలీవుడ్కు పరిచయం చేయనున్నాడని టాక్.దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.