ఆదిలాబాద్ ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ రాజ్
రిమ్స్ కొవిడ్ వార్డు, ఆక్సిజన్ ప్లాంట్, క్వారంటైన్ సెంటర్ల పరిశీలన
ఆదిలాబాద్లోని రిమ్స్లో ఆక్సిజన్ ప్లాంట్ను పరిశీలిస్తున్న ఇన్చార్జి కలెక్టర్ రాహుల్రాజ్
ఎదులాపురం, ఏప్రిల్ 26: కొవిడ్ బాధితులకు మైరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆదిలాబాద్ ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ను అధికారులతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. ముందుగా కొవిడ్ వార్డు , ఐసీయూ, ఎంఐసీయూ వార్డులను పరిశీలించారు. కొవిడ్ బాధితులకు అందిస్తున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. రిమ్స్ ఆవరణలోని ఆక్సిజన్ ప్లాంట్ను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ పోస్ట్ మెట్రిక్ బాలుర మైనార్టీ వసతి గృహాన్ని సందర్శించారు. ప్రభుత్వ హోం క్వారంటైన్లో కొవిడ్ పాజిటివ్ వ్యక్తులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను సందర్శించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ , డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ బానోత్ బలరాం, మున్సిపల్ కమిషనర్ శైలజ, డాక్టర్లు పాల్గొన్నారు.