Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది (extends judicial custody). గతంలో విధించిన కస్టడీ నేటితో ముగియడంతో ఈడీ అధికారులు కేజ్రీని కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ సందర్భంగా.. కేసు పురోగతిలో ఉందని, కేజ్రీ కస్టడీని పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం కేజ్రీవాల్ కస్టడీని మే 20వ తేదీకి పొడిగిస్తూ తీర్పు చెప్పింది.
మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కేజ్రీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ అభ్యర్థనలపై ఇవాళ విచారణ జరిగింది. ఈడీ కూడా తన వాదనలను వినిపించింది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఒకవేళ మధ్యంతర బెయిల్ను మంజూరీ చేస్తే.. అప్పుడు ఎక్సైజ్ పాలసీ కేసుతో లింకున్న ఫైల్స్ను కేజ్రీ చూడరాదు అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒకవేళ బెయిల్ మంజూరీ చేస్తే, అప్పుడు అధికారిక డ్యూటీలను కేజ్రీవాల్ నిర్వర్తించరాదు అని కోర్టు చెప్పింది. ఫైల్స్ మీద సంతకం చేయరాదు అని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది.
Delhi Excise Policy case | Delhi court extends judicial custody of Delhi Chief Minister Arvind Kejriwal till May 20.
(file pic) pic.twitter.com/Iux2ABsRfq
— ANI (@ANI) May 7, 2024
Also Read..
Heavy Rain | బెంగాల్లో కుండపోత వర్షం.. 12 మంది మృతి
Lok Sabha elections | కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Met Gala | మెట్ గాలాలో గాజా అలజడి.. పాలస్తీనా జెండాలతో నిరసనలు.. పలువురు అరెస్ట్