Heavy Rain | గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు (heatwave) నమోదైన పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం (Heavy Rain) కురిసింది. ఉరుములు, మెరుపులు (thunderstorm), ఈదురుగాలులతో కూడి భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఈ వర్షానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇక భారీ వర్షం కారణంగా రాష్ట్రంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఎక్స్ వేదికగా వెల్లడించారు. పుర్బా బుర్ద్వాన్లో ఐదుగురు, పశ్చిమ్ మెదినీపూర్లో ఇద్దరు, పురూలియాలో ఇద్దరు ప్రాణలు కోల్పోయినట్లు చెప్పారు. నదియాలో గోడ కూలి ఇద్దరు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో చెట్టుకూలి ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వర్షాల కారణంగా మరణించిన వారికి ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించారు.
Profoundly sad to know that 9 persons died due to thunderstorms and lightning last night (5 in Purba Burdwan, 2 each in Paschim Medinipur and Purulia), while 2 more persons died due to wall collapses in Nadia and 1 more due to tree collapse in South 24 Parganas. Our district…
— Mamata Banerjee (@MamataOfficial) May 7, 2024
Also Read..
IPL 2024 | ఫ్లైట్ రెండుసార్లు దారి మళ్లింపు.. కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు
Lok Sabha polls | బెంగాల్లో 32.82%, మహారాష్ట్రలో 18.18%.. రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం ఇలా..
Met Gala | మెట్ గాలాలో గాజా అలజడి.. పాలస్తీనా జెండాలతో నిరసనలు.. పలువురు అరెస్ట్