Loksabha Elections 2024 : కర్నాటకలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధ పాలనతో శాంతి భద్రతల పరిస్ధితి కుప్పకూలిందని కర్నాటక మాజీ సీఎం, బెలగావి బీజేపీ అభ్యర్ధి జగదీష్ షెట్టార్ ఆరోపించారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నిత్యం హత్యలు, దోపిడీలు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రమంతటా శాంతి భద్రతలు గాడితప్పాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు భయాందోళనల మధ్య బతకాల్సిన దుస్ధితి నెలకొందని చెప్పారు. నేహ, అంజలి హత్య కేసులు ఇందుకు ప్రబల నిదర్శనమని పేర్కొన్నారు. ఈ హత్యోదంతాలపై త్వరితగతిన విచారణ చేపట్టి వీలైనంత త్వరలో ఈ కేసుల దర్యాప్తును కొలిక్కితీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్ధితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, మోదీ మరోసారి ప్రధానిగా పాలనా పగ్గాలు చేపడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :
Maya Tata | టాటాల వారసురాలు.. వ్యాపార రంగంలో మహిళల సత్తా చాటుతుందా?