Swati Maliwal | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ (Swati Maliwal)పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ (Bibhav Kumar) దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దాడి ఘటనపై స్వాతి మలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఫిర్యాదులో స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. బిభవ్ కుమార్ తనపై భౌతిక దాడికి పాల్పడినట్లు స్వాతి మలివాల్ పేర్కొన్నారు. సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని ఆరోపించారు. 7-8 సార్లు చెంపదెబ్బలు కొట్టి, కడుపుపై బలంగా కొట్టాడని, పొత్తికడుపుపై పదేపదే తన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో తాను పీరియడ్స్లో ఉన్నట్లు వెల్లడించారు. కర్రతో పలు మార్లు బాదినట్లు తెలిపారు.
కాగా, మే 13న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఈ దాడి ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఉదయం 9 గంటల సమయంలో కేజ్రీ నివాసంలోని డ్రాయింగ్ రూమ్లో వేచి ఉన్న సమయంలో సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ ఆమెపై దాడి చేశాడు. ఆ సమయంలో కేజ్రీవాల్ కూడా ఇంట్లోనే ఉన్నట్లు మలివాల్ తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్లో మాత్రం కేజ్రీవాల్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. స్వాతిమలివాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిభవ్ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
Also Read..
Amit Shah | లోక్సభ ఎన్నికల్లో 272 సీట్లు గెలవకపోతే బీజేపీ ప్లాన్ బి ఏంటి..?.. అమిత్ షా సమాధానమిదే
Patna school | పాఠశాల డ్రైన్లో శవమై కనిపించిన మూడేళ్ల బాలుడు.. స్కూల్కు నిప్పంటించిన బాధితులు
PM Modi | అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును వారికి చెందేలా చేస్తాం : ప్రధాని మోదీ