నిర్మల్ అర్బన్, మే 6 : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ముందుకెళ్తూ గులాబీ జెండాను ఎగురవేయాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపును ఇచ్చారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్లో నిర్వహించిన నియోజకవర్గ బూత్ లెవల్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన చెత్త అంతా తొలిగిపోయిందని, ఇప్పుడున్న కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. ఇక్కడున్న మాజీ మంత్రి అసెంబ్లీ ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో ఘోరంగా ఓడిపోయాడని, ఆ వెంటనే బీఆర్ఎస్ను వీడి పార్టీ మారడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే పార్టీలు మారుతున్నారని గుర్తు చేశారు. మతం, మ్యానిఫెస్టోను అడ్డు పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని, అలాంటి వారిని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. బీజేపీకి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మతం గుర్తు కు వస్తుందన్నారు. గుడులు, గోపురాలతో ఓట్లను అడుక్కుంటుంది తప్ప అభివృద్ధి చేసిందేమి లేదని అన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి వచ్చిందని, ఆరు గ్యారెంటీలు బంగాళాఖాతంలో కలిశాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ.. పోలింగ్కు వారం రోజుల సమయం మాత్రమే ఉందని, బూత్ లెవల్ కార్యకర్తలు ప్రచారాన్ని విస్తృతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని అన్నారు. బూత్ లెవల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లి ఓటు వేయించే బాధ్యత మన కార్యకర్తలదే అని అన్నారు.
నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్లో నిర్వహించిన నియోజకవర్గ సమావేశానికి నిర్మల్ రూరల్, సోన్, లక్ష్మణచాంద, మా మడ, నర్సాపూర్(జి), దిలావర్పూర్, సారంగాపూర్ మండలాలతోపాటు నిర్మ ల్ పట్టణంలోని 42 వార్డులకు చెందిన బూత్ లెవల్ ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బీజేపీ, కాంగ్రె స్ పార్టీలకు చెందిన వారు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. వీరికి మాజీ మంత్రి జోగు రామన్న పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త రాంకిషన్రెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షుడు రా ము, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు సుభాష్ రావు, పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి యూనిస్ ఎక్బా ని, నజీర్ గండ్రత్ రమేశ్, అనిల్, టీఎల్ ఎన్ చారి పాల్గొన్నారు.
జైనథ్(బేల), మే 6 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం బేల మండల కేంద్రంలో క్రియాశీల, ముఖ్య నేతలు, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దే శం చేస్తూ జోష్ నింపారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇంటింటికీ వివరించాలన్నా రు. గ్రామాల్లో పోలింగ్ బూత్లవారీగా కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మనోహర్, మండలాధ్యక్షుడు ప్రమోద్రెడ్డి, నాయకులు గంభీర్ ఠాక్రే, సతీశ్ పవార్, మస్క్ తేజ్రావ్, దేవన్న, గొడం సునీల్ పాల్గొన్నారు.