ఉట్నూర్, మే 6 : కాంగ్రెస్ పార్టీ గుర్తు.. ‘గాడిద గుడ్డు’గా మారిందా..? అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్.. అమలు కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని మండిపడ్డారు. ప్రజలు ప్రశ్నిస్తారన్న నెపంతోనే రేవంత్ రెడ్డి తన నెత్తిన గాడిద గుడ్డు బొమ్మ పెట్టుకొని ప్రచారం చేస్తున్నాడని, వారి గుర్తు ‘గాడిద గుడ్డు’గా మారిందని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు కేంద్రం రాష్ర్టానికిరూ.10 లక్షల కోట్లు ఇచ్చిన విషయం కూడా సీఎంకు తెలియకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ బాలాజీ, రితేశ్ రాథోడ్, అశోక్, కొండేరి రమేశ్, శేఖర్, రాజేశ్వర్, మయూర్, కొమ్ము రాంచందర్, కందుకూరి రమేశ్, ఆశన్న, బొడ్డు కిరణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
బోథ్, మే 6 : మర్లపల్లి, పట్నాపూర్, నక్కలవాడ గ్రామాల్లో బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. మండలాధ్యక్షుడు బోరే రవీందర్, పీఏసీఎస్ చైర్మన్ ప్రశాంత్, మాజీ ఎంపీపీ కిషన్, మాజీ ఎంపీటీసీ భోజన్న, నాయకులు రమేశ్, తుకారాం, నారాయణ పాల్గొన్నారు.
తాంసి, మే 6 : మండలంలోని బండల్ నాగపూర్, సవర్గామ గ్రామాల్లో బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తాటిపల్లి రాజు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సామ సంతోష్ రెడ్డి, కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి, యువ మోర్చా అధ్యక్షుడు కిరణ్, నాయకులు సదానందం, నారాయణ, అలకట్ల విలాస్, పోచన్న, వెంకన్న పాల్గొన్నారు.
బజార్హత్నూర్, మే 6 : బజార్హత్నూర్ మండలంలోని బుర్కపల్లి, దాబాడి, గోకొండ గ్రామాల్లో బీజేపీ నాయకులు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పోరెడ్డి శ్రీనివాస్, నాయకులు వెంకన్న, అల్కె గణేశ్, నానం రమణ, చట్ల ఉత్తం, సూది నందు, ధనుంజయ్, తడక శ్రీనివాస్, సుందర్సింగ్, జాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.
ముథోల్, మే 6 : ముథోల్లోని పలు కాలనీల్లో బీజేపీనాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు పోతన్న, మండల ఇన్చార్జి రమేశ్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు దీపాలి, నాయకులు శ్రీనివాస్, పోతన్న పాల్గొన్నారు.
భైంసా, మే 6: పట్టణంలోని నేతాజీనగర్, సిద్దార్థనగర్లో బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నారాయణ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎనుపోతుల మల్లేశ్, బాలాజీ సూత్రావే, అల్లం దిలీప్, పోశెట్టి పాల్గొన్నారు.
కుంటాల, మే 6 : మండలంలోని వెంకూరు, కుంటాలలో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు జక్కుల గజేందర్, కిసాన్ మోర్చా నాయకుడు తాటి శివ, మండల ప్రధాన కార్యదర్శి సూర్యవంశీ సాయి, మహిళా మోర్చా మండలాధ్యక్షురాలు స్వప్న, మాధవరావు, కుమ్మరి గజేందర్, బాజీరావ్, గోవింద్ రావ్ పాల్గొన్నారు.
తానూర్, మే 6 : దహగాం గ్రామంలో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తున్న ఉపాధి కూలీలను ఓటు అభ్యర్థించారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు యాతలం చిన్నారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.