మక్తల్ రూరల్, ఏప్రిల్ 19 : రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని పంచదేవ్పాడ్లో వరి కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్తో కలిసి ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సోమవారం ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ని యోజకవర్గంలో మాగనూర్, కృష్ణ, మక్తల్ మండలంలో పంచదేవ్పాడ్, ఉట్కూర్, నర్వ మండల కేంద్రాలలో వరి కొనుకోలు కేంద్రాలను పీఏసీసీఎస్ సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఇటీవల అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చే యాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమం లో తెలంగాణ ట్రెడ్ కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప, ఉ మ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, ఎంపీపీ వనజ, పస్పుల సర్పంచ్ దత్తప్ప, పంచదేవ్పాడ్ సర్పంచ్ కల్పన కృష్ణ, రైతులు పాల్గొన్నారు.
సదుపాయాలు కల్పించాలి
మక్తల్ టౌన్, ఏప్రిల్ 19 : కొనుగోలు కేంద్రంలో రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే అన్నా రు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే, డీసీసీబీ నిజాంపాషా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ఒకసారి రాకుండా టోకెన్లు ఇవ్వాలని సూచించారు. బస్తాల కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం లో ఏడీఏ దైవ గ్లోరి, ఏవో చక్రవర్తి, ఏఈవో శివ, వ్యవసా య అధికారులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
మరికల్, ఏప్రిల్ 19 : మండలంలో ని తీలేరు సింగిల్విండో కార్యాలయం వద్ద సోమవారం వరి కొనుగోలు కేం ద్రాన్ని విండో చైర్మన్ రాజేందర్గౌడ్, వైస్ ఎంపీపీ రవికుమార్ యాదవ్ ప్రా రంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల కోసం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. రైతుల ఇబ్బందులను ప్రభు త్వం దృషిలో పెట్టుకొని కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విండో వైస్ చైర్మన్ స త్యనారాయణరెడ్డి, పెద్దచింత కుంట సర్పంచ్ శ్రీనివాస్రె డ్డి, మరికల్ రైతుబంధు సమితి కో ఆర్డినేటర్ సంపత్కుమా ర్, విండో డైరెక్టర్లు, మండల వ్యవసాయాధికారి శివకుమా ర్, విండో సీఈవో మధవరావు, నాయకులు పాల్గొన్నారు.
తేమ, తాలు లేకుండా చూడాలి
దామరగిద్ద, ఏప్రిల్ 19 : ధాన్యంలో తేమ, తాలు లే కుండా రైతులు కేంద్రానికి తీసుకురావాలని పీఏసీసీఎస్ చై ర్మన్ ఈదప్ప అన్నారు. మండల కేంద్రంలో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మా ట్లాడుతూ రైతులు కల్లాల వద్దే తేమ, తాలు లేకుండా చూ సుకొని కేంద్రానికి తీసుకువస్తే మద్దతు ధర లభిస్తున్నదని పేర్కొన్నారు. తేమ శాతం ఎక్కువగా ఉంటే కేంద్రానికి వ చ్చిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సప్ప, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మా ణిక్యప్ప, నాయకులు పాల్గొన్నారు.
విడుతల వారీగా తీసుకురావాలి
ధన్వాడ, ఏప్రిల్ 19 : రైతులు సహకరించి విడుతల వారీగా ధాన్యాన్ని కేంద్రానికి తరలించాలని విండో చైర్మన్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. మండలంలోని సింగిల్విండో కార్యాలయ ఆవరణలో విండో చైర్మన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ గతంతో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేశామని, ఈసారి అంతకంటే ఎక్కువ దిగుబడి వచ్చే అవకా శం ఉందని పేర్కొన్నారు. ముందుగానే అధికారులకు ఎ క్కువ బస్తాలను పంపిణీ చేసే విధంగా చూడాలని సూచించామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బాలరాజు, రైతుబంధు సమితి అధ్యక్షుడు వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీధర్రెడ్డి, సర్పంచ్ అమరేందర్రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్గౌడ్, విండో సీఈవో వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి