జూన్ 2 వరకు హెల్త్ ప్రొఫైల్ పూర్తి చేయాలి
ప్రతి గ్రామంలో పల్లె ప్రగతి బోర్డులు పెట్టాలి
వరి, మిర్చి రైతులకు అవగాహన కల్పించాలి
ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ములుగుటౌన్, మే30: ఫుడ్ ప్రాసెసింగ్ కోసం జిల్లాలో ఇంచర్ల సమీపంలో 161 ఎకరాలు సేక రించామని కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. సో మవారం కలక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారుల సమావేశం ఏర్పాటు చేసి పల్లె ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1001 రకం ధాన్యానికి బదులుగా 1064 రకం వేసేలా రైతులకు అవగాహన కల్పించాలని డీఏవో గౌస్ హైదర్ను ఆదేశించారు. మిర్చి విత్తనాలు కొ నుగోలు చేసేటప్పుడు రైతులు రసీదు పొందాలని సూచించారు. జూన్ 2 వరకు హెల్త్ ప్రొఫైల్ పూర్తి చేయాలని అన్నారు. వచ్చే నెల 3 నుంచి 18 వరకు జరుగ నున్న 5వ విడుత పల్లె ప్రగతి కార్య క్ర మంలో శాఖల వారీ గా కేటాయించిన అధికారులు పర్యవే క్షించాలని అన్నారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రగతి బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
శాఖల వారీగా జిల్లాలోని పలు గ్రామాల్లో జరుగుతున్న అభివృ ద్ధిపై ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసు కున్నారు. పదో తరగతి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసినందుకు డీఈవో పాణిని అభినందించా రు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఇలా త్రిపాఠి, వైవీ గణేశ్, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖాధికారులు లక్ష్మణ్, భాగ్యలక్ష్మి, డీపీవో వెంకయ్య పాల్గొన్నా రు. అదేవిధంగా 5వ విడుత పల్లె ప్రగతిపై నేడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించే సన్నాహక సమావేశానికి జిల్లాలోని ప్రజాప్రతి నిధులు, అధికారులు హాజరుకావాలని కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు.
సమస్యలు సకాలంలో పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సకాలం లో పరిష్కరించాలని కలెక్టర్ కృష్ణఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలువురి నుంచి వినతులు స్వీకరించి ఆయా శాఖలకు సిఫారసు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, డీఆర్వో రమాదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, అధికారులు పాల్గొన్నారు.