వరంగల్, సెప్టెంబర్28(నమస్తేతెలంగాణ): వరంగల్ జిల్లా రైస్మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో విభజన లొల్లి ముదిరింది. దీంతో వేర్వేరుగా వరంగల్, హనుమకొండ జిల్లాల అసోసియేషన్ల ఏర్పాటు కోసం ఓ కమిటీ ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలోని రైస్మిల్లర్లు 1994లో వరంగల్ జిల్లా రైస్మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో రిజిస్ట్రే షన్ చేశారు. 2016లో ఉమ్మడి జిల్లాలో ఐదు జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మ హబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు జి ల్లాల్లోని రైస్మిల్లర్లు వరంగల్ జిల్లా రైస్మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి విడిపోయి ప్రత్యేకం గా అసోసియేషన్లను ఏర్పాటు చేసుకున్నారు. వరంగల్ అర్బన్, రూర ల్ జిల్లాల్లోని రైస్మిల్లర్లు మాత్రం వరంగల్ జిల్లా రైస్మిల్లర్స్ వెల్ఫేర్ అసో సియేషన్లోనే కొనసాగుతున్నారు.
తెరపైకి విభజన లొల్లి
తాజాగా వరంగల్, హనుమకొండ జిల్లాలు ఉనికిలోకి రావడంతో వరంగల్ జిల్లా రైస్మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో విభజన వివాదం తెరపైకి వచ్చింది. రెండు జిల్లాల సరిహద్దులోని ఈ అసోసియేషన్ కార్యాల యం ప్రస్తుతం హనుమకొండ జిల్లా పరిధిలో ఉంది. దీంతో వరంగల్ జిల్లా పరిధిలోని రైస్మిల్లర్లలో కొందరు విభజన అంశాన్ని కొద్దిరోజుల క్రితం ప్రతిపాదించారు. దీనిపై కొందరు సానుకూలంగా, మరికొందరు ప్రతికూ లంగా స్పందించారు. ఇదే సమయంలో ప్రస్తుతం వరంగల్ జిల్లా రైస్మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు ఉన్న ఆ స్తులపైనా చర్చ తెరపైకి వచ్చింది. దీంతో అసోసియేషన్ లో విభజన వివాదం చిలికి చిలికి గాలివానలా మా రిం ది. ఇది అసోసియేషన్లోని రెండు జిల్లాల సభ్యుల మ ధ్య వివాదానికి దారి తీసింది. హనుమకొండ జిల్లాలోని రైస్మిల్లర్లలోనూ కొందరు విభజనకు మద్దతు పలికారు.
16 మందితో కమిటీ
ప్రస్తుత అసోసియేషన్లోని సభ్యుల్లో వరంగల్ జిల్లా కు చెందిన రైస్మిల్లర్లు ఎక్కువ మంది ఉ న్నారు. వీరే ప్రత్యేక అసోసియేషన్ ఏర్పాటు చేసు కోవడానికి ఉత్సా హం కనబరుస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ఆస్తులను కూడా పంచాలని కొందరు ప్రతిపాదించినట్లు సమాచారం. దీన్ని హనుమకొండ జిల్లాలోని రైస్మిల్లర్లు వ్యతిరేకిస్తు న్నట్లు తెలిసింది. అసోసియేషన్ భవనం, ఆస్తులు హనుమకొండ జిల్లాలోనే ఉన్నందున అవి తమ జిల్లా అసోసియేషన్కే చెందుతాయని, ఆస్తులు కా వా లంటే ఇందులోనే కొనసాగాలని పేర్కొంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 23న జరిగిన అసోసియేషన్ సమావేశం విభజన వివాదం పై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం కోసం పదహారు మందితో ఒక కమిటీని ఏర్పా టు చేస్తూ తీర్మానిం చింది. అసోసియేషన్ విభజన, ఆస్తులపై ఈ కమిటీ ఏమి తేల్చనుందనేది ఇపుడు రైస్మిల్లర్స్ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చనీయాంశమైంది.