వర్ధన్నపేట, సెప్టెంబర్ 19: పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు తప్పకుండా టీఆర్ఎస్లో గుర్తింపు లభిస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా నూతన, సమన్వయ కమిటీల బాధ్యులు, పార్టీ ముఖ్య నాయకులతో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి అధ్యక్షతన మండలకేంద్రంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న కార్యకర్తలకు దశలవారీగా అవకాశాలు కల్పిస్తామన్నారు. సీఎం కేసీఆర్ తనకు 2013లో నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారని గుర్తుచేశారు. నిబద్ధతతో పని చేసే వారిని గుర్తించి సర్పంచ్లు, ఎంపీటీసీలు, నామినేటెడ్ పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో తాను తొమ్మిదేళ్లుగా టీఆర్ఎస్లో పని చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలను స్వయంగా కలిసేందుకు త్వరలోనే పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం నూతన కమిటీ బాధ్యులకు అభినందనలు తెలిపారు. త్వరలోనే మండల కమిటీని ఎన్నుకోన్నుట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో కుడా చైర్మన్, సంస్థాగత ఎన్నికల ఇన్చార్జి మర్రి యాదవరెడ్డి, జడ్పీటీసీ భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ గుజ్జ సంపత్రెడ్డి, మాజీ జడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి పాల్గొన్నారు.
పార్టీని బలోపేతం చేయాలి
పర్వతగిరి: టీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. మండలకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన టీఆర్ఎస్ నూతన కమిటీల అధ్యక్షులు, అనుబంధ సంఘాలతో సమీక్షించారు. గ్రామీణ స్థాయిలో టీఆర్ఎస్కు మంచి ఆదరణ ఉందన్నారు. దాన్ని రెట్టింపు చేసేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ లునావత్ కమల పంతులు, జడ్పీటీసీ సింగ్లాల్, పార్టీ మండల అధ్యక్షుడు రంగు కుమార్, ఏఎంసీ డైరెక్టర్లు శాంతిరతన్రావు, పట్టపురం ఏకాంతంగౌడ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.