కాశీబుగ్గ, అక్టోబర్ 12: వరంగల్ 20వ డివిజన్లోని పద్మనగర్ పక్కన ఉన్న చిన్నవడ్డేపల్లి చెరువు కట్టను బండ్గా తీర్చిదిద్దుతానని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మంగళవారం ఆయన సద్దుల బతుకమ్మ ఆట ప్రాంతాన్ని సందర్శించారు. ఏఎంసీ రోడ్డులోని పెట్రోల్ పంపు నుంచి వడ్డేపల్లి చెరువు కట్ట వరకూ రూ. 20 కోట్ల నిధులతో బండ్ ఏర్పాటు చేస్తానన్నారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఏడాదిలోనే అతి సుందరమైన ఐలాండ్ను ఏర్పాటు చేసి వచ్చే బతుకమ్మ, దసరా వేడుకలు జరుపుకునేలా సిద్ధం చేస్తానన్నారు. ఆయన వెంట కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, ఎండీ పుర్కాన్, చింతాకుల అనిల్, మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్, బయ్యాస్వామి పాల్గొన్నారు. అలాగే, ఎమ్మెల్యే 19వ డివిజన్లోని ఓసిటీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించే రావణవధ ఏర్పాట్లను పరిశీలించారు. దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లా టూరిజం అధికారి శివాజీని ప్రత్యేక అధికారిగా కలెక్టర్ గోపి నియమించినట్లు తెలిపారు. ఆయన వెంట నిర్వాహకులు దూపం సంపత్, సముద్రాల పరమేశ్వర్, రామ రమేశ్, గుత్తికొండ నవీన్, సిద్ధోజు శ్రీనివాస్, ఓంప్రకాశ్ కోలారియా, గుల్లపెల్లి రాజ్కుమార్, రాచర్ల శ్రీనివాస్, గోరంటల రాజు, బాకం హరిశంకర్, పోలెపాక మార్టిన్ లూథర్, మార్త ఆంజనేయులు, సిలువేరు థామస్ పాల్గొన్నారు.
పనులు త్వరగా పూర్తి చేయాలి..
ఖిలావరంగల్/పోచమ్మమైదాన్: మెట్టు దర్వాజ వద్ద ఉన్న రాణీరుద్రమదేవి సద్దుల బతుకమ్మ ఆట స్థలాన్ని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సందర్శించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్యాదవ్, ఉత్సవ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నా రు. అలాగే, దేశాయిపేటలోని చిన్న వడ్డేపల్లి చెరువు, కొత్తవాడలోని తోటమైదానం వద్ద సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను ఎమ్మెల్యే నరేందర్ పరిశీలించారు. ఏర్పాట్లు ఘనంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు సురేశ్జోషి, కావటి కవిత, గుండేటి నరేందర్, ఎండీ పుర్కాన్, బస్వరాజు కుమారస్వామి, నాయకులు యెలుగం సత్యనారాయణ, నీలం రాజ్కిశోర్, సిరబోయిన రాజు, కొక్కుల సతీశ్, రాజేశ్, చిప్ప వెంకటేశ్వర్లు ఉన్నారు.