పరకాల, ఏప్రిల్ 12 : సీఎం రిలీఫ్ ఫండ్తో రాష్ట్రంలోని పేద ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మె ల్యే నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెంది న 31 మందికి రూ. 14.19 లక్షలు విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బుధవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యవసర సమయంలో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుందన్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమ లు చేస్తుండడంతో పార్టీలకు అతీతంగా అర్హులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ తెలంగాణ పథకాలు అమలు చేసేందుకు సిద్ధమయ్యారని, అందుకే బీఆర్ఎస్ను ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో సరికొత్త ఒరవడిని తీసుకొస్తున్నారని అన్నారు. కాగా, పరకాల మున్సిపాలిటీ పరిధిలో ఇద్దరికి రూ.40 వేలు, పరకాల మండలంలో ముగ్గురికి రూ.97 వేలు, ఆత్మకూరు మండలంలో ముగ్గురికి రూ.1.63 లక్షలు, నడికూడలో ఆరుగురికి రూ.2.58 లక్షలు, దామెర మండలంలో ముగ్గురికి రూ.74 వేలు, సంగెంలో ఆరుగురికి రూ.1.66 లక్షలు, గీసుగొండలో నలుగురికి రూ.3.8 లక్షలు, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో నలుగురికి రూ.2.4 లక్షల విలువ చేసే చెక్కులను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్
గీసుగొండ : కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని గంగదేవిపల్లి గ్రామానికి చెందిన గిర్క సంపత్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ సభ్వత్యం ఉంది. అతడి కుటుంబానికి బుధవారం రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆయన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సభ్వత్వం తీసుకున్న వారందరికీ బీమా ఉందన్నారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయని తెలిపారు. దేశంలో రైతులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని స్పష్టం చేశారు. సర్పంచ్ గోనె మల్లారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దొంగల రమే శ్, ఎలుకుర్తి సర్పంచ్ పూండ్రు జైపాల్రెడ్డి, నాయకులు సుం కరి శివకుమార్, బెంబిరి బాబురావు, రఘు పాల్గొన్నారు.