హనుమకొండకు చెందిన యువతి పురుగుల మందు తాగి బలవన్మరణం చెందింది. ఈ నెల 18న ఆమె పురుగుల మందు తాగగా.. సోమవారం నాడు కన్నుమూసింది. దామెర మండలం లాదెళ్ల గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. వరుసకు సోదరుడైన ప్రణయ్ అనే యువకుడు.. బాధితురాలి ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని ఆమెను బెదిరించాడు.
సాయి అనే స్నేహితుడితో ఆమె ఉన్న ఫొటోలను సేకరించిన ప్రణయ్.. వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరింపులకు దిగాడు. వీటిని భరించలేకపోయిన ఆమె భయంతో పురుగుల మందు తాగేసింది. వరంగల్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం నాడు కన్నుమూసింది.