కరీమాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పేద విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో ఉచితంగా నాణ్యమైన విద్య లభిస్తున్న దని ఎంపీ పసునూరి దయాకర్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఎస్ఆర్ నవోదయ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది నవోదయ సీటు సాధించిన విద్యార్థులను బుధవారం తిమ్మాపూర్లో సన్మానించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ విద్యార్థులు నవోదయలో సీటు సాధించడం గొప్ప విషయమన్నారు. వారికి ఆ తరహాలో శిక్షణ ఇచ్చిన నిర్వాహకులను మెచ్చుకున్నారు.
పేద విద్యార్థులు చదువుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తుందన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరా లు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ పసునూరి కుమారస్వామి కార్పొరేటర్లు ఈదురు అరుణ, జలగం అనిత నాయకులు పోశాల సదానందం, ఇనుగాల జోగిరెడ్డి, జీవంత్రెడ్డి, ఉపాధ్యాయులు సంపత్, వెంకటస్వామి, సుధాకర్ పాల్గొన్నారు.