అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి (CM YS Jagan) పాలనలో రాష్ట్రం సర్వనాశనం (Destroyed) అయ్యిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే నాకు ముఖ్యమని స్పష్టం చేశారు. గుడివాడలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ (Land Titiling) యాక్టుతో ఆస్తులు కాజేయాలని చూస్తున్నారని జగన్పై విరుచుకుపడ్డారు.ఇంట్లో ఉన్న వాళ్లను కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి దాడులు, దోపిడీలు తప్ప చేసిందేమి లేదని విమర్శించారు.
మీ ఆస్తులు కాపాడుకోవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని తెలిపారు. 30 కేసులుండి ఐదేళ్ల నుంచి జగన్ బెయిల్పై ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజల గుండెల్లో ధైర్యం నింపడానికే నేనొచ్చా నని వెల్లడించారు. మాటిస్తే ప్రాణాలు పోవాలిగానీ వెనక్కి తీసుకోకూడదని అన్నారు.
చంద్రబాబు (Chandra Babu) ను అకారణంగా జైలులు వేసినా ఆయన తొణకలేదని, . ఇలాంటి వ్యక్తికి అండగా నిలబడాలని ఆనాడే అనుకున్నానని వివరించారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని చెప్పా . ప్రజాస్వామ్యాన్ని కాపడటమే నాకు ముఖ్యమని అన్నారు.