హైదరాబాద్ : రాష్ట్ర దివ్యంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం సీఎం కేసీఆర్ను తెలంగాణ భవన్ లో కలసి ఆశీర్వాదం తీసుకున్నారు .అంతకు ముందు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
తన ఫుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్య సభ ఎంపీ జోగిన పల్లి సంతోష కుమార్ పిలుపు మేరకు వికలాంగుల సంక్షేమ కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని కాపాడే బాధ్యతను కూడా తీసుకోవాలని వాసుదేవ రెడ్డి పిలుపు నిచ్చారు.