వరంగల్/మహబూబాబాద్, ఏప్రిల్ 25(నమస్తేతెలంగాణ): పార్లమెంటు ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. వరంగల్ లోక్సభకు 58 మంది అభ్యర్థులు 89 సెట్లు, మహబూబాబాద్కు 48 మంది అభ్యర్థులు 60 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్లో చివరి రోజు గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్కుమార్ తరపున ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ నేతలు వాసుదేవరెడ్డి, మర్రి యాదవరెడ్డి, సుందర్రాజు యాదవ్ మరో సెట్, బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ మరో సెట్ నా మినేషన్ పత్రాలను ఆర్వో ప్రావీణ్యకు అందజేశారు.
స్వతంత్ర అభ్యర్థులుగా సినీ నటుడు బాబుమోహన్, మోత్కుపల్లి ప్రభాకర్, బర్ల బాబు, పోలేపాక రూప, ఎంసీపీఐ(యూ) అభ్యర్థిగా కొత్తపల్లి సావిత్రి, బీఎస్పీ అభ్యర్థిగా పంజా కల్పన, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పసుల రవి నామినేషన్ వేశారు. మహబూబాబాద్లో బీఆర్ఎస్ నుంచి మా లోత్ కవిత, బీజేపీ నుంచి సీతారాంనాయక్, తెలంగాణ జాంగీర్ పార్టీ నుంచి వాంకుడోత్ రవికుమార్, సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి కృష్ణవేణి, జాటోత్ జమున, ధర్మసమాజ్ పార్టీ నుంచి రవ్వ భద్రమ్మ, గోండ్వా నా గణతంత్ర పార్టీ నుంచి సోయం కన్నారా జు, బీఎస్పీ నుంచి కోనేటి సుజాత, స్వతంత్ర అభ్యర్థులుగా గుగులోత్ శేఖర్, అశోక్, మైప తి అరుణ్, ప్రేమ్లాల్, వెంకన్న, లక్ష్మీనారా యణ, చక్రవర్తి, ప్రశాంత్ నామినేషన్ వేశారు.