ఖిలావరంగల్, జనవరి 26: జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. కలెక్టరేట్లో బుధవారం 73వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే, లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యజిత్ ఆధ్వర్యంలో ఐవోబీ ఆర్ఎం అశోకన్, అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, బీ హరిసింగ్తో కలిసి కలెక్టర్ దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా జిల్లా అధికార యంత్రాంగం కృషి చేయాలన్నారు. అందరూ సమన్వయంతో కలిసి పని చేస్తేనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, డీసీపీ వెంకటలక్ష్మి, ఆర్డీవో మహేందర్జీ పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో డీ వాసంతి, ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో జిల్లా అధికారి శ్రీనివాసరావు, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో మహేందర్జీ, వ్యవసాయ శాఖ కార్యాలయంలో జేడీఏ ఉషాదయాళ్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్లో మేనేజర్ భాస్కర్రావు, సివిల్ సప్లయ్ అధికారి లక్ష్మీభవాణి, ఆర్డీఏ కార్యాలయంలో ఆర్టీవో ఆఫ్రీన్ సిద్ధిఖీ, జడ్పీలో సీఈవో రాజారావు, వరంగల్ రైల్వేస్టేషన్లో స్టేషన్ మేనేజర్ శ్రీనివాస్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
అందరికీ సమాన అవకాశాలు : ఎమ్మెల్యే పెద్ది
నర్సంపేట: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి దేశానికి స్వాతంత్య్రం అందించిన ఎందరో మహానుభావులు ఆ తర్వాత రాజకీయంగా, సాంఘిక, ఆర్థిక, సామాజికంగా అందరికీ సమాన అవకాశాలు లభించేలా కృషి చేశారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. యువత అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, బీరం సంజీవరెడ్డి, రాయిడి రవీందర్రెడ్డి, నల్లా మనోహర్రెడ్డి, కౌన్సిలర్లు, సొసైటీ చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.
ఎగిరిన జాతీయ జెండా
వరంగల్: గణతంత్ర దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఇన్చార్జి అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్ జాతీయ జెండాను ఎగురవేయగా, ఎస్ఈ సత్యనారాయణ, కార్యదర్శి విజయలక్ష్మి, సీహెచ్వో సునీత, డిప్యూటీ కమిషనర్ జోనా, డీసీపీ ప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు. హనుమకొండలోని కుడా కార్యాలయంలో ప్లానింగ్ అధికారి అజిత్రెడ్డి జెండాను ఆవిష్కరించగా, ఈఈ భీమ్రావు, కార్యదర్శి మురళీధర్రావు పాల్గొన్నారు. కాకతీయ మెడికల్ కళాశాల అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్, కేఎంసీ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో నోడల్ అధికారి డాక్టర్ దుగ్యాల గోపాల్రావు జాతీయ జెండాను ఎగురవేశారు. అసిస్టెంట్ నోడల్ అధికారులు డాక్టర్లు నర్సింగరావు, చంద్రశేఖర్, రాజ్మోహన్, శ్రవణ్, హీనా, రహ్య, ఇన్చార్జి నర్సింగ్ సూపరింటెండెంట్ సుశీల పాల్గొన్నారు.